13న వైకాపా మేధోమథనం
Published Thursday, 9 June 2016హైదరాబాద్, జూన్ 8: అనంతపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రకు వచ్చిన విశేష స్పందనతో కదం తొక్కుతున్న వైకాపా శ్రేణులకు మార్గనిర్దేశనం చేసేందుకు, వచ్చే మూడేళ్ల పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాలని వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన విజయవాడలో మేధోమథనం పేరిట విస్తృత స్థాయి సదస్సును నిర్వహించాలని ఆయన పార్టీ రాజకీయ సలహా కమిటీని ఆదేశించారు.