మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం
Published Thursday, 9 June 2016ధన్వాడ, జూన్ 9: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో మీషన్భగీరత పథకం ద్వారా నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యంను మరో సంవత్సరంలోపు అందించడం జరుగుతుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేంధర్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ మండలంలోని పస్పుల, ఇబ్రహీంపట్నం, మాద్వార్ గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలను పేట ఎమ్మెల్యే రాజేంధర్రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు చేయలేని పనులను టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.