S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం

ధన్వాడ, జూన్ 9: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో మీషన్‌భగీరత పథకం ద్వారా నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యంను మరో సంవత్సరంలోపు అందించడం జరుగుతుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేంధర్‌రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ మండలంలోని పస్పుల, ఇబ్రహీంపట్నం, మాద్వార్ గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలను పేట ఎమ్మెల్యే రాజేంధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా పేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు చేయలేని పనులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.

ఐడియా!

*ముదిరిపోయిన ఆనపగింజల్ని బియ్యంతో కలిపి నానేసి రుబ్బి, దోసెల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
*బియ్యంలో కొంచెం మెంతులు కలిపి రుబ్బితే దోసెలు గట్టిగా ఉంటాయి.
*మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం, జీలకర్ర, కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగానో, చిప్స్‌గానో పెట్టుకొని ఎండాక వేయించుకుని తింటే రుచిగా ఉంటాయి.
*పూరీ పిండి కలిపేటపుడు కొంచెం చెక్కర కలిపితే పూరీలు చాలా సేపటివరకు తాజాగా ఉంటాయి.
*అరకిలో గోధుమ పిండికి రెండు మగ్గిన అరటిపళ్లు, ఒక కప్పు పెరుగు కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి.

గుండెను తొలిచే బాధ..

చక్కనమ్మ చిక్కినా ఆందం అని అనుకోవచ్చు. ఇలాంటి వారు నాజుకుగా ఉన్నామని సంబరపడిపోతుంటారు. మరికొంతమంది లావెక్కిపోతూ ముఖం మీద, ఒంటిమీద, గడ్డంపైన అవాంచిత రోమాలు వచ్చి ఆందోళన చెందుతుంటారు. ఈ బాధను ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతుంటారు. ఇలా మహిళల్లో విభిన్న మార్పులకు దోహదం చేస్తున్న అంశాలు చాలా ఉంటాయి. మహిళల్లోని హార్మోన్ల సమతుల్య లోపం వల్ల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మహిళల శారీరక ఎదుగుదలలో తేడాలు కనిపించటం సహజం అని అనుకుంటారు. కాని దీని వెనుక పీసీఓఎస్ అనే సమస్య దాగి ఉందని తెలుసుకోవటం చాలా కష్టం. అండాశయాల్లో కనిపించే ఈ నీటితిత్తులు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

షాంపూ వాడకపోతే ఏవౌతుంది?

ఆధునిక జీవన విధానంలో కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. యాంత్రిక జీవనంలో అన్ని యంత్రాలపై తయారుచేసిన వస్తువులనే వాడేస్తున్నాం. ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుడు కాయలతో తలస్నానం చేయటమంటే గంటసేపు పడుతోంది. కాబట్టి అంత సమయాన్ని వెచ్చించే ఓపిక, తీరిక లేక రూపాయి షాంపూ కొనేసి తలంటుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే సడన్‌గా షాంపూ వాడకం ఆపేస్తే ఏవౌతుందని చాలామంది అనుకుంటారు. ఏమీ కాదు. ఇంకా మంచిదేనని వైద్యులు అంటారు. నూనె తనంతట తానే ఉత్పత్తి చేసుకునే స్వభావం తలకు ఉన్నది. అందుకే ప్రత్యేకంగా ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదంటారు.

అసమానతలపై ఆర్ట్‌తో పోరాటం

మహిళల పట్ల చూపిస్తున్న అసమానతలపై పదిహేడేళ్ల యువతి తాను నేర్చుకున్న కళతో పోరుబాట పట్టింది. సామాజికి సమస్యలను ప్రధాన అంశంగా తీసుకుని ఈ చిన్నారి గీస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయటమే కాకుండా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పదిహేడేళ్ల వయసులో అమ్మాయిలు ఆధునిక ఫ్యాషన్లు ఒలకబోస్తూ.. షికార్లతో కాలాక్షేపం చేయాలనుకుంటారు. కాని ఢిల్లీకి చెందిన ఈ కాంచీ చోప్రా మాత్రం అలాంటి భ్రమల జోలికి పోకుండా ఆర్టివిజమ్‌తో తన బ్లాగ్‌లో వివిధ సామాజిక సమస్యలపై గీచిన చిత్రాలను పోస్ట్‌చేస్తూ తన కాలాన్ని సద్వినియోగం చేస్తోంది.

పట్టించుకుంటే పట్టు కోల్పోతాం...

‘విమర్శ’ అనేది నిజానికి చాలా కష్టమైన పనే అయినా కొంతమంది విషయంలో మాత్రం అది చిటికేసినంత తేలికైన పని. ఎందుకంటే వీళ్ళకు ఎదుటివాళ్ళను చీటికీ మాటికీ.. చిన్న చిన్న విషయాలకు విమర్శించడం అంటే మహా ఇష్టం.. మహా సరదా. దేవుడు మనిషికి నోరు ఇచ్చింది అడ్డదిడ్డంగా.. ఎలా పడితే అలా వాగటానికన్నట్లు ఇష్టమొచ్చినట్లు అనాలోచితంగా ఏదో ఒకటి ఎవరినో ఒకరిని అంటూనే వుంటారు. ‘ఒక వేలుతో ఎదుటివాడిని చూపిస్తే.. నాలుగువేళ్ళు తననే చూపిస్తుంటాయన్న’ వంటిమీద స్పృహ ఆ సమయంలో వాళ్ళకు ఉండదు. ఏవో లోపాలు, పొరపాట్లు, హెచ్చుతగ్గులు అందరిలోనూ ఉంటాయని.. అలాగే తనలోనూ అవి ఉండి వుండవచ్చుననీ ఏ మాత్రం ఆలోచించరు.

- వాణీచలపతిరావు

mataata

నేర్చుకుందాం

సీ. అనఘుఁడు రాజర్షియై తన శ్శక్తిమై బ్రహ్మర్షిభావంబుఁ బడసియున్న
సన్మునీశ్వరుఁడు విశ్వామిత్రుఁ డతిఘోర తపము సేయుచునున్నఁ దత్తవమున
కెంతయు వెఱచి దేవేశ్వరు డప్పరో గణములతో నగ్రగణ్యయైన
దాని మేనక యను ధవళాక్షిఁ బిలిచి ‘విశ్వామిత్రుపాలికి ఁ జని తదీయ
ఆ. ఘోరతపము చెఱచి కోమలి
నాదైన దేవ రాజ్యమహిమఁ దివిరి నీవు
గావు’ మనిన నదియుఁ గడు భయంపడి యమ
రేశ్వరునకు మ్రొక్కి యిట్టు లనియె

యమహాపురి 64

‘‘ఎవరి సరదాలు వాళ్ళవి’’ అనుకున్నాడు యోగి.
ఆ అమ్మాయి- అక్కడున్న ఆ ఇద్దరివంకా చిరాగ్గా చూసి, ‘‘అమ్మా, బామ్మా! ఏమిటి, బయటివాళ్ళ ముందు మీ గొడవ?’’ అని విసుక్కుని, యోగి వంక తిరిగి, ‘‘నేను అవినాష్‌గారమ్మాయిని. ఈ ఇంట్లో ఎవరి మాటైనా, ఆఖరికి మా నాన్నగారి మాటైనా- నా తర్వాతే! విషయం నాకు చెప్పండి’ అంది.
ఏమనుకున్నారో మిగతావాళ్లిద్దరూ అక్కణ్ణించి జారుకున్నారు. యోగి తను వచ్చిన పని చెప్పాడు.
‘‘నాన్న నిన్న ఊరెళ్లారు. ఏ ఊరో చెప్పలేదు. ఫోన్ తీసుకెళ్లలేదు. ఎప్పుడొచ్చేదీ చెప్పలేదు. చాలా ముఖ్యమైన ప్రోగ్రామని చెప్పారు. మీరు నాకు మీ నంబరిచ్చి వెడితే- ఆయన వచ్చేక ఫోన్ చేసి చెబుతాను’’ అంది.

వసుంధర

Pages