భవిష్యత్తుపై భరోసాకే...
Published Saturday, 4 June 2016అమలాపురం, జూన్ 3: విభజన ఫలితంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ప్రజలకు వివరించి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సభలో యనమల ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన ఏకపక్ష విధానం, కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, విధులు వంటి అంశాలను వివరించారు.