ఇరిగేషన్ ప్రాజెక్టులపై నేడు పార్లమెంటరీ బృందం కీలక భేటీ
Published Saturday, 4 June 2016హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై శనివారం హైదరాబాద్లో పార్లమెంటరీ బృందం కీలక సమావేశం జరుగుతుంది. ప్రాజెక్టుల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. పార్లమెంటు సభ్యులు హుకుం సింగ్ అధ్యక్షతన ఏర్పడిన 17 మంది సభ్యుల కమిటీ హైదరాబాద్కు రానుంది. మాదాపూర్లోని నోవాటెల్లో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పార్లమెంటు సభ్యుల బృందం వివిధ అంశాలపై చర్చిస్తుంది. సత్వర సాగునీటి పారుదల ప్రయోజనాల పథకం (ఎఐబిపి) కింద చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. ఎఐబిపి కింద 1996-97లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులలో తెలంగాణలో 16 ఉన్నాయి.