సెల్యూట్ చేద్దాం...
Published Friday, 3 June 2016శత్రువును పసిగట్టే డేగ కళ్లు..చురుకైన చూపులు..చేతిలో తుపాకులతో కాపలాకాసే జవాన్లు. ఇది ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో కనిపించే దృశ్యం. తీవ్రవాదులకు, క్రిమినల్స్కు ఆలవాలమైన ఈ ఓపెన్ బోర్డర్లో కోట్లాదిరూపాయలు విలువచేసే మాదకద్రవ్యాలు సైతం నిరంతరం రవాణా అవుతుంటాయి. సహజంగానే ఇలాంటి ప్రాంతాల్లో కనిపించే జవాన్లను పురుషులుగానే ఊహించుకుంటాం. కాని ఇక్కడ మనకు కనిపించేది మహిళా జవాన్లు. దేశంలో తొలిసారిగా‘ సశస్త్ర సీమ బాల్’ పారా మిలటరీ ఫోర్స్లో మహిళలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ఈ విభాగంలో శిక్షణ తీసుకున్న మహిళా జవాన్లు నేడు దేశంలో కీలకమైన ఈ సరిహద్దు ప్రాంతాలలో సేవలందిస్తున్నారు.