మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి
Published Saturday, 4 June 2016తలమడుగు, జూన్ 3: మహిళలు స్వయం ఉపాధిలో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలు కృషి చేస్తోందని, అందులో భాగంగానే రాయితీపై నిధులను అందిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని డిసిసిబి చైర్మెన్ దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రుయ్యాడి గ్రామంలో 21 డ్వాక్రా గ్రూప్ మహిళలకు రూ.10లక్షల 50వేల రుణాలను అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేనంత పెద్ద మొత్తంలో రుణాలను తెరాస ప్రభుత్వం అందిస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కృషి చేస్తోందని అన్నారు.