ఫీజుల పెంపు రద్దు చేయాలి
Published Friday, 3 June 2016విశాఖపట్నం, జూన్ 2: ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కైందని సిపిఎం కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు విమర్శించారు. సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజుల పెంపును రద్దు చేసి, పాత ఫీజులనే కొనసాగించాల్సిందిగా కోరారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన సమాచారం పూర్తిగా అక్రమాలపుట్టగా పేర్కొన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం మొత్తం 309 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకుగాను 174 కళాశాలలకు ఏ గ్రేడు 117కి బి గ్రేడ్, 18కి సి గ్రేడ్ కేటాయించారన్నారు. ఇప్పటి వరకు ఉన్న డిగ్రేడ్ను తొలగించారన్నారు.