ఏడు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్..?
Published Saturday, 4 June 2016బోధన్, జూన్ 3:కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుండటంతో కొత్త మండలాలతో పాటు కొత్తగా రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పదమూడు మండలాలతో కొనసాగుతున్న బోధన్ డివిజన్ ఏడు లేదా ఎనిమిది మండలాలకే పరిమితం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలాలు గనుక పెరిగితే కొత్తగా బాన్సువాడ కూడా డివిజన్గా ఏర్పాటయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బోధన్ డివిజన్ను బాన్సువాడకు మారుస్తారని కొంతకాలం నుండి ప్రచారం జరుగుతున్న సంగతి విధితమే.