విద్యుత్షాక్తో కానిస్టేబుల్ మృతి
Published Wednesday, 1 June 2016శ్రీకాకుళం: ఇక్కడికి సమీపంలోని ఎచ్చెర్ల పోలీస్ శిక్షణ కేంద్రంలో బుధవారం ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగ తగిలి ఆదినారాయణ అనే ఎఆర్ కానిస్టేబుల్ మరణించాడు. ఇదే ఘటనలో గాయపడిన మరో కానిస్టేబుల్ను ఆస్పత్రిలో చేర్పించారు. కానిస్టేబుల్ మరణంతో ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్లో విషాదం అలముకుంది.