దండులా కదిలిన శోభాయాత్ర
Published Wednesday, 1 June 2016కరీంనగర్, మే 31: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన కరీంనగర్లో మంగళవారం నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర ఘనంగా జరిగింది. హిందు సమాజాన్ని జాగృతం చేయడంతోపాటు ఏకతాటిపైకి తెచ్చేందుకు చేపట్టిన ఈ యాత్రలో హిందువులు దండులా కదిలిరాగా, అందరి ప్రశంసలు చూరగొంది. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సైతం కరీంనగర్ నగరానికి తరలివచ్చి శోభయాత్రలో పాల్గొనడం విశేషం. హిందూ ఏక్తా యాత్ర సందర్భంగా కరీంనగర్లోని ప్రముఖ కూడళ్ళు, రహదారులన్ని కాషాయ తోరణాలతో నిండిపోయాయి. యాత్ర సందర్భంగా హనుమాన్, సీతారాముల విగ్రహాలను రథంపై పెట్టి నగరంలో ఊరేగింపు నిర్వహించారు.