ఎపి క్యాబినెట్ భేటీ ప్రారంభం
Published Wednesday, 1 June 2016విజయవాడ: ఎపి మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. ఈ నెల 2న జరిగే నవనిర్మాణ దీక్ష, రెండేళ్ల పాలన, కొత్తగా ఉద్యోగ నియామకాలు, వివిధ సంస్థలకు స్థలాల కేటాయింపు, రాజధాని నిర్మాణం, హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు, సంక్షేమ పథకాల అమలు తీరు, కొత్త పథకాలకు రూపకల్పన వంటి పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోందని సమాచారం.