విదేశీ విద్యకు 20లక్షల సహాయం
Published Wednesday, 1 June 2016హైదరాబాద్, మే 31: విదేశాల్లో విద్యను అభ్యసించే ఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని పెంచింది. అంబేద్కర్ ఓవర్సిస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఇప్పటి వరకు ఒక్కో విద్యార్థికి పది లక్షల రూపాయల సహాయం అందించే వారు. దానిని రెట్టింపు చేశారు. 20లక్షల రూపాయల సహాయం అందిస్తారు. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు మంగళవారం సంతకం చేశారు.