కట్టుకున్నవాడే కాలయముడు
Published Wednesday, 1 June 2016కనిగిరి రూరల్, మే 31: కట్టుకున్నవాడే కాలయముడుగా మారాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య, ఇద్దరు కన్నబిడ్డలపై ఏమాత్రం మానవత్వం లేకుండా వారి మెడలకు తాడుతో ఉరి బిగించి చంపేశాడు. ఈ సంఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని చింతలపాలెంలో చోటుచేసుకుంది. స్థానిక సిఐ యు సుధాకర్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపాలెం గ్రామంలోని తమ్మినేని శ్రీనివాసరెడ్డికి గత కొనే్నళ్ల క్రితం మొదటి భార్య వెంకటలక్ష్మి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అనంతరం పదేళ్ల క్రితం ఆదిలక్ష్మి (28) అనే యువతితో వివాహమైంది. వీరికి గణేష్ (7), భవాని (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.