రాజకీయం విడగొడితే... భాష మళ్ళీ కలుపుతుంది
Published Wednesday, 1 June 2016విజయవాడ (బెంజిసర్కిల్), మే 31: రాజకీయాలు మనుషులను, ప్రాంతాలను విడగొడితే, భాష ఒక్కటే అందరినీ కలుపుతుందని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా లోకేశ్ పేర్కొన్నారు. తెలుగు భాషా ప్రాబల్యం తగ్గుతున్న తరణంలో రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు, ఎన్టిఆర్ ట్రస్ట్ సంయుక్తంగా మంగళవారం నగరంలోని శేషసాయి కళ్యాణ మండపంలో తెలుగుభాషా సాంస్కృతిక సమ్మేళనం, మండలి బుద్ధప్రసాద్ షష్ఠిపూర్తి మహోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు.