S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
మన దేశపు ‘పరపతి స్థాయి’ని యథాతథంగా కొనసాగించాలని ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ -ఎస్పి- సంస్థ నిర్ణయించడం మన దేశపు ఆర్థిక వ్యవహారాలలో సంపన్న దేశాల అక్రమ ప్రమేయం కొనసాగుతోందనడానికి నిదర్శనం. గత వారం ‘మూడీస్’ అన్న మరో ‘దళారీ’ సంస్థ మన దేశపు ఆర్థిక పరపతి స్థాయి - సావరిన్ రేటింగ్ - కొద్దిగా పెరిగినట్లు ప్రకటించింది! ఇలా ‘ప్రశంసాపత్రం’ జారీ చేయడం కూడా ఆర్థిక అక్రమ ప్రమేయంలో భాగం!!
బంగ్లాదేశ్లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలు స్వదేశమైన బర్మా-మైన్మార్-కు తరలివెళ్లడానికి రంగం సిద్ధం కావడం ‘సయోధ్య’కు ప్రతీక. ఈ సయోధ్య బంగ్లాదేశ్, బర్మా ప్రభుత్వాల మధ్య కుదిరింది. గత కొన్ని నెలలుగా బర్మాలోని అరకాన్ - రక్షణ -రఖానే- ప్రాంతం నుంచి లక్షలాది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్లోకి వలస రావడానికి కారణం రోహింగ్యాలలోని ‘జిహాదీ’లు దశాబ్దులుగా జరుపుతున్న బీభత్సకాండ.
హఫీజ్ సరుూద్ అనే జిహాదీ బీభత్సకారుడిని పాకిస్తాన్లోని లాహోర్ హైకోర్టు గృహనిర్బంధం నుంచి విడుదల చేయడం ఆశ్ఛర్యకరం కాదు. ఎందుకంటె ఈ జిహాదీ ముష్కరుని నిర్బంధించడం విడుదల చేయడం పాకిస్తాన్ ప్రభుత్వం 2008 డిసెంబర్ నుంచి ఆడుతున్న నాటకం! కానీ ‘‘గట్టిగా’’ నిరసనలను తెలపడం మినహా మన ప్రభుత్వం మరేమీ చేయలేకపోతుండడం అంతుపట్టని పరిణామక్రమం.
అంతర్జాతీయ న్యాయస్థానం - ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ -ఐసిజె - పదవికి జరిగిన హోరాహోరీ పోరాటంలో మనదేశం బ్రిటన్ను ఓడించగలగడం ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి పెరిగిన పలుకుబడికి నిదర్శనం. మనదేశం ప్రతినిధి, అంతర్జాతీయ న్యాయమూర్తి దల్వీర్ భండారీ రెండవసారి ఎన్నికకావడం మనకు లభించిన చారిత్రక దౌత్య విజయం.
అరుణాచల్ ప్రదేశ్లో రాష్టప్రతి రామనాథ్ కోవింద్ - నవంబర్ పంతొమ్మిదవ తేదీన - పర్యటించడంపట్ల చైనా ప్రభుత్వం తెలిపిన నిరసనకు ఇటీవల జరిగిన ‘భారత చైనా’ సరిహద్దు చర్చలు విచిత్రమైన నేపథ్యం. ఈ సరిహద్దు చర్చలు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. సరిహద్దు వివాదం పరిష్కారం కోసం ఉభయ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ‘సయోధ్య’కు సామరస్య వైఖరికి నిదర్శనమన్నది జరుగుతున్న ప్రచారం.
‘పద్మావతి’ చలనచిత్రాన్ని డిసెంబరు ఒకటవ తేదీన విడుదల చేయడం లేదని నిర్మాతలు ప్రకటించడం ఆశ్చర్యకరం కాదు. మేవాడ్ రాజ్యానికి చెందిన మహారాణి పద్మినీదేవి చరిత్రను వక్రీకరించడానికి ఈ చలనచిత్ర రూపకర్తలు యత్నించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతుండడం నిర్మాతల నిర్ణయానికి నేపథ్యం! ఆరోపణలలో వాస్తవం ఉన్నట్టయితే ‘పద్మావతి’ ‘నిర్మాతలు’ దేశచరిత్రకు జాతీయతకు విద్రోహం తలపెట్టడానికి ఒడిగట్టిన విద్రోహులు..
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ భవనాలను నిర్మించడానికి నడుం బిగించడం, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ కార్యక్రమానికి సమాంతర పరిణామం. అక్కడ రాజధాని నిర్మాణానికి ఇక్కడ సచివాలయ నూతన భవన నిర్మాణానికి వ్యతిరేకత ఏర్పడడం ఈ సమాంతర శుభ పరిణామాలలో నిహితమై ఉన్న అపశ్రుతులు. అమరావతి నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా పవిత్రవంతమైన మట్టిని తీసుకొనివచ్చి నిక్షిప్తం చేసి వెళ్లడం చారిత్రక మహాపరిణామం.
‘అక్రమ లాభార్జన నిరోధక జాతీయ అధికార సంస్థ’ ఏర్పడడం వినియోగదారులకు ఆనందకరం. అక్రమ వ్యాపారులు వినియోగదారులను కొల్లగొట్టకుండా నిరోధించడానికి, అక్రమ వ్యాపారులను విచారించి న్యాయస్థానాల ద్వారా వారిని శిక్షింపచేయడానికి ఈ నూతన సంస్థ- అక్రమ లాభార్జన నిరోధక జాతీయ అధికార సంస్థ - నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ - ఏర్పాటు దోహదం చేస్తుందట!
తోడేళ్లూ గుంటనక్కలూ
తలపడి పోరిన వేళ,
ధర్మాత్ములు ఎవరన్నది
దగుల్బాజి ప్రశ్నన్నా...
నేపాల్ ప్రభుత్వం భద్రతకు సంబంధించిన విధాన వైపరీత్యాలను గ్రహించగలుగుతోందనడనికి ఇది నిదర్శనం. తమ దేశంలోని గండకీనదిపై ‘విద్యుత్ ఉత్పాదక జలాశయాన్ని’ నిర్మించడానికి చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నేపాల్ ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. ఇలా ఈ ఒప్పందం రద్దుకావడం నేపాల్తో చైనా కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణకు ఎదురుదెబ్బ. నేపాల్ భద్రత మనదేశ భద్రతతో ముడిపడి ఉంది.