-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రో కబడ్డీ ఊరిస్తోంది. తొడగొట్టి ప్రత్యర్థిని చిత్తుచేసి వీర ప్రతాపాన్ని ప్రదర్శించే ఆట వచ్చె నెల నుంచే మొదలవుతోంది. దీనికి సంకేతంగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమై నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రదీప్ నర్వాల్, అనూప్కుమార్, మోను గోయల్, రిషాంక్లు మ్యాచ్ల కోసం ఎలా సన్నద్ధమవుతున్నారో చూపిస్తూ ప్రచార గీతాన్ని రూపొందించారు.
గాలె: ఆతిథ్య శ్రీలంకతో సిరీస్ మొదలుపెట్టిన భారత మహిళా జట్టు తొలి వనే్డలో ఘన విజయం సాధించింది. 96 పరుగుల వద్దే లంక జట్టును కుప్పకూల్చిన మిథాలి జట్టు, ఒక్క వికెట్ నష్టంతోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్లో బోణీ కొట్టింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కోరుకున్న లంక జట్టు భారత బౌలర్ల అటాకింగ్ ముందు నిలవలేకపోయింది.
లండన్, సెప్టెంబర్ 11: అలుపెరుగని టీమిండియా పోరాటం చివరకు గెలుపును మిగల్చలేదు. సిరీస్లో చివరిదైన ఐదో టెస్ట్ను 118 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. మలి ఇన్నింగ్స్లో కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ధీరోదాత్త పోరాటం -సిరీస్ ఓటమిలో భారత్ గౌరవాన్ని ఇనుమడించలేదు. టెస్ట్ క్రికెట్లో కరుడుగట్టిన ఇంగ్లీష్ జట్టుకే ఐదో టెస్ట్లోనూ విజయం దక్కింది. 4-1 తేడాతో జో జట్టు సిరీస్ను వశం చేసుకుంది.
ఆశించిన అద్భుతాలు అందకున్నా, అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించింది టీమిండియా. ఓటమి నుంచి తప్పించుకునే అవకాశం లేకున్నా, గెలుపు కోసం అహరహం శ్రమించింది. మలి ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి ఇంగ్లీష్ జట్టు 464 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచినపుడు -చివరి టెస్ట్లోనూ పరాభవం తప్పదన్న అంచనాలే. ముగింపుపై ఆశలు లేకుండానే బరిలోకి దిగిన కోహ్లీ సేన, ఒకదశలో గెలుపు అసాధ్యం కాదేమోనన్న ఆశలు రేకెత్తించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: కోచ్లు, క్రీడాకారులకు భారత ప్రభుత్వం అందించే అత్యున్నత అవార్డులైన ద్రోణాచార్య, ధ్యాన్చంద్ అవార్డులకు అర్హులను ఎంపిక చేసే కమిటీ బాధ్యతలను జస్టిస్ ముకుల్ ముద్గల్కు అప్పగించనున్నారు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణను సుప్రీం కోర్టు అప్పట్లో ముకుల్ ముద్గల్కు అప్పగించడం తెలిసిందే.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ పరమైంది. తొమ్మిదోసారి ఫైనల్కు చేరిన జొకోవిచ్, ముచ్చటగా మూడోసారి టైటిల్ సాధించాడు. తాజా విజయంతో పీట్ సంప్రాస్ గ్రాండ్శ్లామ్ రికార్డును చేరుకున్నాడు.
ఇక ఓటమిని అంగీకరించడమే భారత్కు మిగిలింది. అసాధ్యమైన పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన ముందుపెట్టిన జో జట్టు.. ఐదో టెస్ట్నూ తన ఖాతాలో వేసుకుంది. సిరీస్కు ముందు స్వీప్ కబుర్లు చెప్పిన టీమిండియా.. ఒక్క టెస్ట్ విజయం (1-4)తో స్వీపైపోయింది. ఆటలో గెలుపోటములు సహజం కనుక.. వాళ్లు గెలిచారు అనేకంటే మేం ఓడాం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం భారత్కు మిగిలింది.
ముంబయి, సెప్టెంబర్ 10: ఆసియా గేమ్స్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో అద్వితీయ ప్రతిభ కనబర్చి స్వర్ణంతో చరిత్ర సృష్టించిన రాహి సర్నోబాత్... ఈసారి చరిత్రను తిరగరాసేందుకు తర్ఫీదు పొందుతోంది. టోక్యో 2020 ఒలింపిక్లో స్వర్ణాన్ని సాధించడం ద్వారా చరిత్రను తిరగరాయాలన్న సంకల్పంతో ముందుకెళ్తోంది. 27ఏళ్ల ఈ షార్ప్ షూటర్ ఆసియా గేమ్స్లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళగా రికార్డుకెక్కడం తెలిసిందే.
దుబాయ్, సెప్టెంబర్ 10: ఐసీసీ మహిళా చాంపియన్షిప్ టోర్నీలో భాగంగా టీమిండియా మహిళా జట్టు నేటినుంచి 16 వరకూ శ్రీలంకలో పర్యటించనుంది. ఈ విషయాన్ని క్రికెట్ గవర్నింగ్ బాడీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2021లో అర్హత కోసం పాయింట్ల పట్టికలో కింది వరుసలోనున్న శ్రీలంక, భారత్, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో తలపడుతున్నాయి.
భారత ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఓస్ట్రావా (చెక్ రిపబ్లిక్)లో జరుగుతున్న ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించి, పతకం అందుకున్న తొలి భారత అథ్లెట్గా రికార్డు నెలకొల్పాడు. 18వ ఆసియా గేమ్స్లో అర్పిందర్ స్వర్ణాన్ని సాధించడం తెలిసిందే. జావెలిన్ త్రో స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా మాత్రం ఎలాంటి పతకం సాధించకుండా నిరాశ మిగిల్చాడు.