S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/20/2018 - 23:32

దుబాయ్, సెప్టెంబర్ 20: పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ గొప్పగా రాణించాడు. మూడు వికెట్లు పడగొట్టి, జట్టు విజయంలో తనవంతు భూమిక పోషించాడు. ఇంతకీ అతని విజయ రహస్యం ఏమిటంటే, నెట్స్‌లో బౌలింగ్ చేయకపోవడమేనట. అతనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

09/20/2018 - 23:30

చెన్నై, సెప్టెంబర్ 20: జార్ఖండర్ స్పిన్నర్ షాబాజ్ నదీం కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లిస్ట్ ‘ఏ’లో సుమారు రెండు దశాబ్దాల క్రితం నమోదైన రికార్డును తిరగరాశాడు. విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నదీం కేవలం 10 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు కూల్చాడు.

09/20/2018 - 23:29

హైదరాబాద్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్‌గా ఆర్. సురేందర్ రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. క్లబ్ డైరెక్టర్ల సమావేశంలో డైరెక్టర్లు/ స్టివార్డ్స్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. కే. భూపాల్ రెడ్డి, సీఎస్ సురేష్, అనంత్ కిషన్ రావు, ఆర్. రాజేష్ డైరెక్టర్స్/ స్టివార్డ్స్‌గా ఎన్నికైనట్టు క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

09/20/2018 - 23:28

సిడ్నీ, సెప్టెంబర్ 20: పాకిస్తాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడతామని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ స్పష్టం చేశాడు.

09/20/2018 - 04:35

దుబాయలో జరుగుతున్న ఆసియాకప్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్ ఆటగాడు ఇమామ్ ఉల్ హక్‌ను ఔట్ చేసిన భారత పేసర్ భువనేశ్వర్ కుమార్. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

09/19/2018 - 23:51

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పారా బాడ్మింటన్ క్రీడాకారుడు రాజ్‌కుమార్ (మధ్య)కు అర్జున అవార్డును ప్రదానం చేస్తున్న కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (కుడి). చిత్రంలో క్రీడా కార్యదర్శి రాహుల్ ప్రసాద్ భట్నాగర్ కూడా ఉన్నారు

09/19/2018 - 23:50

కటునాయగే, సెప్టెంబర్ 19: శ్రీలంక మహిళలతో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ క్రికెట్ సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకున్న భారత మహిళల జట్టు బుధవారం టీ-20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్‌ని 13 పరుగుల తేడాతో గెల్చుకొని, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. పూనమ్ యాదవ్ 26 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

09/19/2018 - 23:48

దుబాయ్, సెప్టెంబర్ 19: ఆసియా కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో నిలకడగా ఆడలేకపోయన భారత్ బుధవారం తనదైన రీతిలో ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 43.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది.

09/19/2018 - 23:47

దుబాయ్, సెప్టెంబర్ 19: ‘పసికూన’ హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌ని గెలిచినప్పటికీ, అభిమానులను ఆకట్టుకోవడంలో టీమిండియా క్రికెటర్లు దారుణంగా ఓడారు. హాంకాంగ్ మరికొంత నిలకడగా ఆడివుంటే, భారత్ పరిస్థితి మరో విధంగా ఉండేది. నిజానికి అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో భారత్ ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. శిఖర్ ధావన్ (120 బంతుల్లో 127 పరుగులు) సెంచరీ సాధించగా, అంబటి రాయుడు (60) అర్ధ శతకంతో రాణించాడు.

09/19/2018 - 23:47

లాస్ ఏంజిల్స్, సెప్టెంబర్ 19: అంపైర్లు, రిఫరీలకు ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. పోటీలో ఉన్న వ్యక్తులు లేదా జట్ల పట్ల సమభావంతో వ్యవహరిస్తూ, సమ న్యాయం చేయాలి. కానీ, అందుకు భిన్నంగా ప్రవర్తించి, తన అభిమాన టెన్నిస్ ఆటగాడితో ముచ్చట చేసినందుకు ఓ అంపైర్‌పై వేటు పడింది.

Pages