-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కొలంబో, మే 17: వెస్టిండీస్తో ఈనెల 30నుంచి జరిగే మూడు టెస్టు మ్యాచ్లలో శ్రీలంక మాజీ కెప్టెన్ యాంజెలో మాథ్యూస్, మీడియం పేసర్ సురంగ లక్మల్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు గురువారం వెల్లడించింది.
డొంగ్హేయి సిటీ (కొరియా), మే 17: ఇక్కడ జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్, భారత మహిళా జట్టు ప్రత్యర్థి మలేషియాను సెమీ ఫైనల్స్లో 3-2తో ఓడించి ఫైనల్కు చేరుకుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్లలో జపాన్పై 4-1, చైనాపై 3-1 తేడాతో భారత్ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫైనల్లో ఆతిధ్య జట్టు కొరియాతో శనివారంనాడు తలపడుతుంది.
న్యూఢిల్లీ, మే 17: పింక్ బాల్ టెస్టు మ్యాచ్లంటే భయమెందుకు, డే అండ్ నైట్ మ్యాచ్లు తప్పనిసరిగా ఆడాలని భారత స్పిన్నర్ హర్బజన్ సింగ్ సూచించాడు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఆఖరులో ఆస్ట్రేలియాతో జరిగే అడెలైడ్ టెస్టులో డే అండ్ నైట్ మ్యాచ్లలో టీమిండియా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆడబోదని వస్తున్న వాదనలపై ఆయన స్పందించాడు.
న్యూఢిల్లీ, మే 17: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతూ మొత్తం టీమ్లలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగే పోరులో విజయం సాధించడం ద్వారా పైమెట్టుకు ఎగబాకాలని తహతహలాడుతోంది. చెన్నై ఇంతవరకు 12 మ్యాచ్లు ఆడగా, వాటిలో ఎనిమిదింట్లో విజయం సాధించి, మరో నాలుగింట్లో పరాజయాన్ని చవిచూసింది.
ముంబయి: మహిళా క్రికెటర్ల కోసం ఐపీఎల్ తరహాలో బీసీసీఐ ఈ నెల 22న ఒక టీ20 మ్యాచ్ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. భారత అమ్మాయిలతో పాటు విదేశీ క్రికెటర్లు పాల్గొనే ఈ మ్యాచ్లో పోటీ పడే రెండు జట్లకు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన నాయకత్వం వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. బీసీసీఐ జట్ల పేర్లను, జట్టు సభ్యులను వెల్లడించింది.
డబ్లిన్, మే 16: పాకిస్తాన్లో పర్యటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఇది కొత్త ఊపిరినిచ్చే పరిణామమే. టెస్టు హోదాను దక్కించుకున్న తర్వాత ఐర్లాండ్ తన తొలి మ్యాచ్ని పాకిస్తాన్తో ఆడింది.
న్యూఢిల్లీ, మే 16: పలు రకాలుగా చుట్టుముడుతున్న సమస్యల నుంచి క్రికెట్ను పరిరక్షించడమే తక్షణ కర్తవ్యంగా గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలోని స్ట్రాటజిక్ వర్కింగ్ గ్రూప్ (ఎస్డబ్ల్యూజీ) గురువారం సమావేశం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధికారులతో కూడా ఈ బృందం చర్చిస్తుంది.
రోమ్, మే 16: ఇక్కడ జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రష్యాబ్యూటీ మరియా షరపోవా రెండో రౌండ్ చేరడానికి మారథాన్ మ్యాచ్ని ఆడాల్సి వచ్చింది. చిరుజల్లులు కురుస్తున్న నేపథ్యంలో, ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీని ఆమె 7-5, 3-6, 6-2 తేడాతో ఓడించి రెండో రౌండ్ చేరింది. మరింత ముందంజ వేయడానికి ఆమె రెండో రౌండ్లో డొమినికా సిబుల్కొవాను ఢీ కొంటుంది.
కోల్కతా, మే 16: ప్రస్తుత ఐపీఎల్లో ప్లే ఆఫ్ దశకు చేరుకోవడానికి తమకు దారులు మూసుకుపోలేదని, అవి ఇంకా తెరిచే ఉన్నాయని, తప్పకుండా తమ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకుంటుందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానే ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 142 పరుగులు చేసిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
బెంగళూరు, మే 16: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దాదాపు ప్లే ఆఫ్పై ఆశలు సన్నగిల్లే స్థితిలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గురువారం తమ సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే పోరు చావోరేవో తేల్చనుంది. ఏవిధంగా చూసుకున్నా ఈ రెండు జట్లలో సన్రైజర్స్ అన్నివిధాల పైచేయిగానే ఉంది.