S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/10/2020 - 23:36

రాజ్‌కోట్, మార్చి 10: బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అర్పిత్ వాసవాద సెంచరీ సాధించాడు. దీనితో రెండో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 8 వికెట్లకు 384 పరుగులు చేయగలిగింది. ఐదు వికెట్లకు 206 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన ఈ జట్టుకు అర్పిత్ అండగా నిలిచాడు.

03/10/2020 - 05:20

దుబాయి: మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం అంతర్జాతీ య క్రికెట కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా బ్యాటిం గ్, బౌలింగ్ ర్యాంకులను సోమవారం ప్రకటిం చింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపె నర్ బేత్ మూనీ రెండు స్థానాలను మెరుగు పర్చుకొని 762 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలవగా, న్యూజిలాండ్ మాజీ కెప్టెణ్ సుజీ బేట్స్ 750 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానా న్ని పదిలం చేసుకుంది.

03/09/2020 - 23:58

శ్రీనగర్‌లో జరుగుతున్న ఐ లీగ్ మ్యాచ్‌లో భాగంగా సోమవారం తలపడుతున్న రియల్ కాశ్మీర్, క్వెస్ ఈస్ట్ బెంగాల్ జట్లు. ఈ మ్యాచ్‌లో క్వెస్ ఈస్ట్ బెంగాల్ 1-0 తేడాతో విజయం సాధించింది.

03/09/2020 - 23:56

రాజ్‌కోట్, మార్చి 9: రంజీట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఫైనల్‌లో బెంగాల్‌తో తలపడుతున్న సౌరాష్ట్ర జట్టు తొలిరోజు సోమవారం 5 వికెట్లు కోల్పోయ 206 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్టక్రు ఓపెనర్లు హర్విక్ దేశాయ, అవీ బారోత్ మొదటి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో హర్విక్ దేశాయ (38) షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

03/09/2020 - 23:57

దుబాయ, మార్చి 9: ఇటీవల మహిళల టీ20 ప్రపంచకప్ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఐసీసీ టీ20 జట్టును ప్రకటించింది. అంతకుముం దు మహిళల ప్రపంచకప్ అంచనాలను మించి మంచి ఫలితాలు తీసుకురావడంపై ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. టోర్నీ ముగిశాక జట్టును ఎంపిక చేసింది.

03/09/2020 - 05:13

మెల్‌బోర్న్: మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుపై 85 పరుగుల తేడాతో విజ యం సాధించి, ఐదోసారి కప్‌ను ముద్దాడింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు అలీస్సా హేలీ, బేత్ మూనీ మొదటి బంతి నుంచే చెలరేగి ఆడారు.

03/09/2020 - 05:15

అహ్మాదాబాద్, మార్చి 8: స్వదేశంలో ఈ నెల 12 నుంచి దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. తొలిసారి నూతన సెలక్షన్ కమిటీ చైర్మన్ సునీల్ జోషీ కమి టీ నేతృత్వంలో జట్టును ఆదివారం ప్రకటించారు. అయతే తుది జట్టులో ఇటీవల గా యం నుంచి కోలుకున్న రోహిత్ శర్మకు చోటు కల్పించలేదు. మరికొన్ని రోజులు విశ్రాంతి నిచ్చారు.

03/09/2020 - 05:15

కరాచీ, మార్చి 8: ఆసియా కప్ టీ-20 ఇంటర్నేషనల్ టోర్నమెంట్ తటస్థ కేంద్రంలోనే ఉంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఇషాన్ మణి ప్రకటించాడు. ఈ టోర్నీని దుబాయ్‌లో నిర్వహిస్తారంటూ భారత క్రికెట్ ని యంత్రణ బోర్డు (బీసీసీఐ) చైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇషాన్ మణి అతని ప్రకటనను పరోక్షంగా ధ్రువీకరించాడు.

03/09/2020 - 01:20

మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై 85 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదోసారి విశ్వ విజేతగా అవతరించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయ 184 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో భారత్ 99 పరుగులకే ఆలౌటైంది.

03/08/2020 - 04:51

మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ-20 వరల్డ్ కప్‌లో ఇంతకు ముందు రెండు పర్యాయాలు సెమీ ఫైనల్స్ చేరుకున్నప్పటికీ, ఫైనల్లోకి అడుగుపెట్టలేకపోయిన భారత జట్టు ఈసారి టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆదివారం పోరాడనుంది. మొదటిసారి ఫైనల్ చేరిన ఈ జట్టు గెలిస్తే, సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.

Pages