S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/11/2020 - 23:14

చెన్నై, మార్చి 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించొద్దంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైం ది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 29 నుం చి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వహిం చడానికి బీసీసీఐకి కేంద్రం అనుమతిని ఇవ్వొద్దం టూ మద్రాస్ హైకోర్టులో న్యాయవాది అలెక్స్ బెంజిగర్ పిటిషన్ వేశారు.

03/11/2020 - 23:13

రాజ్‌కోట్, మార్చి 11: బెంగాల్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ ఫైనల్ మ్యాచ్ల్ సౌరాష్ట్ర జట్టు మూడో రోజు బుధవారం 425 పరుగులు చేసి ఆలౌట్ అయంది. ధరేంద్ర జానీ (33) పరుగులతో అజేయంగా నిలిచినా, చిరాగ్ జానీ (14), ప్రేరక్ మన్కాడ్ 90), కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ (20) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన బెంగాల్ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయ 134 పరుగులు చేసింది.

03/11/2020 - 02:01

గ్రేటర్ నోయిడా: గ్రేటన్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. ఇరు జట్లు సమానమైన స్కోరు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. ఫలితాన్ని నిర్ణయించడానికి సూపర్ ఓవర్ తప్పలేదు. కెవిన్ ఓ బ్రియా న్ చివరి బంతిలో సిక్సర్ కొట్టి, ఐర్లాండ్‌ను గెలిపించాడు.

03/10/2020 - 23:47

న్యూఢిల్లీ, మార్చి 10: కఠిర పరిశ్రమతోనే విజయాలు సాధ్యమవుతాయని భారత బాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో మహిళలు ఎంతో మంది క్రీడల్లో రాణిస్తున్నారని, భారీ సంఖ్యలో దేశానికి పతకాలు సాధించి పెడతారన్న నమ్మకం తనకు ఉందని ఆమె పేర్కొంది.

03/10/2020 - 23:45

రోమ్, మార్చి 10: ఇటలీలో అన్ని రకాల క్రీడా టోర్నమెంట్లు, సిరీస్‌లకు బ్రేక్ పడింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సిరీ ఏ’ ఫుట్‌బాల్ లీగ్‌సహా అన్ని రకాల క్రీడలను వచ్చేనెల మూడవ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్టు ఇటలీ ప్రధాన మంత్రి గిసెప్ కానే్ట ప్రకటించాడు. ఈ ప్రకటన వెలువడక ముందు ‘సిరీ ఏ’లో బ్రెస్కియాతో జరిగిన మ్యాచ్‌ని ససూలో 3-0 తేడాతో గెల్చుకుంది.

03/10/2020 - 23:44

అమాన్ (జోర్డాన్), మార్చి 10: ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ పోటీపడిన ప్రపంచ నంబర్ వన్ అమిత్ పంఘల్ పురుషుల 52 కిలోమీటర్ల విభాగంలో, లలీనా బొర్గొహైన్ మహిళల 69 కిలోల విభాగంలో కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. వీరు తమతమ విభాగాల్లో సెమీ ఫైనల్స్ చేరుకున్న వెంటనే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. అయితే, ఇద్దరూ సెమీస్‌లో పరాజయాలను ఎదుర్కొన్నారు.

03/10/2020 - 23:42

లాస్ ఏంజిల్స్, మార్చి 10: కరోనా వైరస్ పట్ల అమెరికా లీగ్స్ అప్రమత్తమయ్యాయి. బాస్కెట్ బాల్, సాకర్, ఐస్ హాకీ తదితరలీగ్స్ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతే ఆటగాళ్లను లాకర్ రూమ్స్‌లోకి అనుమతిస్తామని ప్రకటించారు. అంతకంటే ముందుగానే అన్ని గదులను శుభ్రపరచి, కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

03/10/2020 - 23:40

న్యూఢిల్లీ, మార్చి 10: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించడమే తమ లక్ష్యమని భారత హాకీ జట్టు కెప్టెన్ మన్దీప్ సింగ్ అన్నాడు. 2019 సంవత్సరానికి ధన్‌రాజ్ పిళ్లే ఫార్వర్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇటీవల స్వీ కరించిన అతను మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు అర్హ త సంపాదించడానికి జట్టు యావత్తు విశేషంగా కృషి చేసిందన్నాడు. సమష్టిగా పోరాడడం వల్లే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యామని అన్నాడు.

03/10/2020 - 23:38

హనోనీలో వియత్నాం ఫార్ములా వన్ గ్రాంప్రీ రేస్ కోసం నిర్మాణాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన కార్మికులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ఏప్రిల్ 5న జరగాల్సిన వియత్నాం గ్రాండ్ ప్రీ షెడ్యూల్ ప్రకారమే ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

03/10/2020 - 23:37

న్యూఢిల్లీ, మార్చి 10: కరోనా వైరస్ భయం వెంటాడుతుండగా, ముందు జాగ్రత్త చర్యగా 2019-20 సీజన్ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ చివరి రౌండ్ మ్యాచ్‌లను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) వాయిదా వేసింది. ఈ విషయాన్ని అన్ని సభ్య సంఘాలకు నోటీసు ద్వారా వెల్లడించింది.

Pages