S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/20/2018 - 04:09

హైదరాబాద్, మే 19: తెలంగాణ ఎమ్సెట్ ఫలితాల్లో విజయం సాధించి, ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడంతో 18933 మంది ర్యాంకులను కోల్పోయారు. వారు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో విజయం సాధిస్తే అపుడు వారికి ర్యాంకులను కేటాయిస్తామని కన్వీనర్ డాక్టర్ యాదయ్య తెలిపారు. ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీంకు 1,36,305 మంది హాజరుకాగా వారిలో 1,06,646 మంది అర్హత సాధించారు. ఇంటర్ పాసై, ఎమ్సెట్‌లో అర్హత సాధించిన వారు 94,592 మంది ఉన్నారు.

05/20/2018 - 03:11

హైదరాబాద్, మే 19: ఉస్మానియా యూనివర్శిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ల గడువును ఈ నెల 19 నుండి 21 వ తేదీ వరకూ పొడిగించారు. 200 రూపాయిల జరిమానాతో మే 27వరకూ పొడిగించారు. 1000 రూపాయిల జరిమానాతో జూన్ 1వ తేదీ వరకూ పొడిగించారు.

05/20/2018 - 04:28

హైదరాబాద్: కర్నాటక రాష్ట్ర అసెంబ్లీలో శనివారం బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో తెలంగాణలోని కాంగ్రెస్‌లో కదనోత్సాహం కనిపించింది. శనివారం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టివీలో కర్నాటక ఫలితాలను ఆసక్తిగా తిలకించారు. అక్కడ యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కేరింతలు కొట్టారు. కొంత మంది కార్యకర్తలు ఉత్సాహంగా గాంధీ భవన్ ఆవరణలో బాణాసంచా పేల్చారు.

05/20/2018 - 02:30

తిరుపతి, మే 19: తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దాన్ని దీటుగా ఎదుర్కోవడానికి టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై ఇప్పటికే టీటీడీ జియ్య ర్లు, ఆలయ నూతన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారి బృందం చేత మీడియాకు వివరణ ఇప్పించారు.

05/20/2018 - 02:24

హైదరాబాద్, మే 19: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్‌లను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మూసివేస్తామని ద.మ. రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఎంపిక చేసిన 11 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

05/20/2018 - 02:18

హైదరాబాద్, మే 19: రాష్ట్ర విభజన సందర్భంగా రోడ్డు రవాణా సంస్థలో నెలకొన్న పెండిం గ్ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఇరు సంస్థల మేనేజింగ్ డైరక్టర్లు పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ బస్‌భవన్‌లో టీఎస్ ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు భేటీ అయ్యారు. సం స్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు, ఇతర విషయాలను వెంటనే పరిష్కరించుకుందామని చర్చించుకున్నారు.

05/20/2018 - 01:25

హైదరాబాద్, మే 19: తెలంగాణ ఎమ్సెట్ -2018 ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సచివాలయంలో విడుదల చేశారు. తొలిసారి ఎమ్సెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో ఈనెల 2 నుండి 7 వరకూ విజయవంతంగా నిర్వహించినందుకు జెఎన్‌టియు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ప్రభుత్వం గత నాలుగేళ్లలో విద్యారంగంలో చేపడుతున్న చర్యలువల్ల ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరిగిందన్నారు.

05/20/2018 - 01:19

వరంగల్, మే 19: అడ్డదారిన పీఠమెక్కేందుకు ప్రయత్నించిన బీజేపీ ఆటలను కాంగ్రెస్ సాగనివ్వలేదని, కర్నాటకలో కాంగ్రెస్ విజయం 2019లో అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ విజయానికి నాంది అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కర్నాటకలో అడ్డదారిన అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా విఫలమయ్యారని అన్నారు.

05/20/2018 - 04:26

హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ప్రస్తుతం ఎన్నికల బంతి ప్రభుత్వ కోర్టులో పడ్టట్టయింది. ఓటర్ల జాబితాలను ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (టీఎస్‌ఎస్‌ఈసీ) దాదాపు 40 రోజుల పాటు యుద్ధప్రాతిపదికన కసరత్తు చేసింది. ప్రస్తుతం జాబితాలు గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు.

05/20/2018 - 04:26

రాజమహేంద్రవరం: కాళ్ళు తడవకుండా నదిని దాటొచ్చేమో గానీ, కళ్ళు తడవకుండా జీవితాన్ని మాత్రం దాటలేమని తూర్పు మన్యంలో జరిగిన లాంచీ ప్రమాదం మరొక్క సారి రుజువుచేసింది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటుతున్నా నేటికీ ఆ గట్టుపై గిరిజనులకు జల మార్గమే ప్రధాన రవాణా సాధనం.

Pages