S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/14/2020 - 01:04

ఉప్పల్, ఏప్రిల్ 13: అమెరికా యూఎస్‌ఏ నుంచి వచ్చిన హబ్సిగూడ కాకతీయనగర్ స్ట్రీట్ నెంబర్ 3లో నివసిస్తున్న ఓ యువతికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె తల్లిదండ్రులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో క్వారంటైన్‌లో ఉన్నారు.

04/14/2020 - 01:00

మేడ్చల్, ఏప్రిల్ 13: రైతులు అధైర్య పడవద్దని ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని పూడూరు, మేడ్చల్ పీఏసీఎస్ కార్యాలయాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

04/14/2020 - 04:35

వికారాబాద్: అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప జనం బయటకు రావద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యవసర వస్తువులను ప్రజల ఇళ్ల వద్దకే పంపే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణను ఆదేశించారు.

04/14/2020 - 00:56

తలకొండపల్లి, ఏప్రిల్ 13: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ చేయూత ఇస్తున్నారు.ఆమనగల్లు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల పేదలకు సుమారు 25 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టి ఇంటికో శానిటైజర్ పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాలలో ప్రతి కుటుంబానికి శానిటైజర్ అందించారు.

04/14/2020 - 00:16

ఎక్కువ కేసులు ఇక్కడి నుంచే..* నగరాన్ని జోన్లుగా విభజించి యూనిట్లుగా ఏర్పాటు*
కంటైనె్మంట్లలో పకడ్బందీ ఏర్పాట్లు* రాష్ట్ర సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలి*
ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
*

04/14/2020 - 00:14

హైదరాబాద్, ఏప్రిల్ 13: వలస కార్మికులకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీ ఇచ్చారు. అయితే మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికుల యోగక్షేమాలను కేటీఆర్ స్వయంగా సోమవారం వివిధ కన్‌స్ట్రక్షన్ సైట్లకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు.

04/14/2020 - 00:11

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని, కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ సోమవారం నాడు పిలుపునిచ్చారు. నగరంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పార్టీ కార్యాలయంలో మాస్క్‌ల ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పది లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.

04/14/2020 - 00:09

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కరోనా (కోవిడ్-19) పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఆదివారం వరకు 531 మందికి కరోనా సోకినట్టు ప్రకటించగా, సోమవారం నమోదైన 61 పాజిటివ్ కేసులను కలిపి మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 592కు చేరినట్టయింది.

04/14/2020 - 00:18

హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భుతంగా ఉందని, ఈ పంటల కొనుగోలుకు బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఒక టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, రబీలో 40 లక్షల ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 10 లక్షల ఎకరాల్లో పల్లీ, ఉద్యాన తదితర పంటలు వేశారని గుర్తు చేశారు.

03/23/2020 - 06:37

హైదరాబాద్, మార్చి 22: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు కోటిన్నర జనాభా అలరారుతున్న హైదరాబాద్ మహానగరం మూగబోయింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలకడం విశేషం. పేద, మధ్య తరగతి, ధనిక వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇంటికే పరిమితమయ్యారు.

Pages