-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా కే కేశవరావు, కేఆర్ సురేష్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఎన్నికైన వీరిద్దరూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు నుంచి విజయపత్రాలను అందుకున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రాజేంద్రనగర్ జన్వాడ డ్రోన్ కేసులో 14 రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్న ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తొలుత కుకట్ పల్లి కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
నల్లగొండ, మార్చి 17: తెలంగాణ గంగగా పిలుచుకునే మూసీ నదిని ప్రక్షాళన, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వినతిపత్రం అందించారు. మంగళవారం భారత రాష్టప్రతి రామ్నాథ్కోవిద్ పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన అల్పాహార విందుకు హాజరైన ఎంపీ వెంకట్రెడ్డి, విందు అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
మహదేవ్పూర్, మార్చి 17: లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) ప్రాజెక్టు కింద బ్యాక్ వాటర్తో సూరారం నుండి మహదేవ్పూర్ వరకు 200 ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని లక్ష్మీ బ్యారేజీ బ్యాక్ వాటర్ వల్ల నీట మునిగిన పంటలను పరిశీలించారు.
సికిందరాబాద్, మార్చి 17: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు...కానీ గాంధీ ఆసుపత్రి వైద్యులను నమ్ముకుంటే ప్రాణాలు హరీమనేలా ఉన్నాయి. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువున్నాయని, తాముంటున్న చోట రక్తం దొరకటం కష్టం కావటంతో నగరంలోని గాంధీ ఆసుపత్రికి వస్తే ఏకంగా ప్రసవం చేశారు. వైద్య వర్గాలు తలదించుకునే ఈ ఘటన గాంధీ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
హైదరాబాద్, మార్చి 17: అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా సమాధానాలు దాటవేసే ధోరణిలో సాగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ ధనిక రాష్టమ్రైన తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుందామనే లక్ష్యంతో ప్రభుత్వం ఉ దన్నారు. రాష్ట్రం అప్పు రూ.
హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉపయోగించిన భాష చాలా దారుణంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ఆరోపించారు. ఐదేళ్లలో కేసీఆర్ అన్ని వర్గాలనూ మోసం చేశారని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఎన్నడూ ఇవ్వలేదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 17: భారత స్వాతంత్య్రం సిద్ధించడానికి ముందు వరకూ అనేక శతాబ్దాలుగా లెక్కలేనన్ని చిరుత పులులను పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో అత్యధిక సంఖ్యలో ఈ చిరుతలున్నాయి. వీటిని ఆఫ్రికన్ చిరుతలు అని పిలుస్తున్నారు. మరో పక్క ఆసియా చిరుతలుగా ఇరాన్లో 50 వరకూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో చిరుతలను దేశంలో పున: ప్రవేశం చేయించాలనే చర్చ బాగా జరిగింది. ఇంతకు పూర్వం భారతదేశంలో ఆసియా చిరుతలు ఉండేవి.
హైదరాబాద్, మార్చి 17: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి కల్వకుంట్ల కవితను ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
హైదరాబాద్, మార్చి 17: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడాన్ని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, అలయెన్స్ అగనెస్ట్ సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలు స్వాగతించాయి. కేవలం తీర్మానంతో సరిపోదని ఎన్పీఆర్ను రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ తరహాలు ప్రభుత్వం జీవో జారీ చేయాలని అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.