S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/22/2020 - 01:23

హైదరాబాద్: విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్నవారు ఆరోగ్యం ఏ మాత్రం బాగా లేకపోయినా బయట తిరగవద్దని చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నానని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, విదేశాల నుండి వస్తున్న వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం ఏ మాత్రం ఉన్నా, వెంటనే ఐసోలేట్ కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

03/22/2020 - 01:10

హైదరాబాద్, మార్చి 21: కరోనా నివారణకు తెలంగాణలో 24 గంటల పాటు స్వచ్ఛందంగా బంద్ పాటిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ప్రగతి భవన్‌లో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి చేశారు.

03/21/2020 - 16:15

హైదరాబాద్: తెలంగాణలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఒక మహిళకు కరోనా వైరస్ సోకింది. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 21కి చేరింది. కేపీహెచ్‌బీ కాలనీలోని ఫేస్-2లో ఒక మహిళకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. కరోనా సోకిన మహిళ కుటుంబంలోని సభ్యులకు కూడా కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.

03/21/2020 - 16:14

హైదరాబాద్: స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించటమే కరోనా వైరస్ కట్టడి సోపానం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవి పాటించక పోవటం వల్ల అమెరికా, ఇటలీ దేశాలు ఇపుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనా పక్కనే ఉన్న జపాన్, సింగపూర్, హాంకాంగ్ వైరస్ విస్తరణను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. స్వీయ నిర్బంధంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని అన్నారు.

03/21/2020 - 16:13

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు అందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిద్దామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంటారని, కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, అత్యవసర సేవల కోసం 100కి డయల్ చేయవచ్చని తెలిపారు.

03/20/2020 - 12:47

హైదరాబాద్: పరీక్షాకేంద్రాల్లో మంతి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. బోరబండ, యూసఫ్‌గూడ పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఆమె తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

03/20/2020 - 07:31

కర్నూలు, మార్చి 19: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో శ్రీశైలం దేవస్థానం అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ బంద్ చేయిస్తున్నారు. మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనాలు చేయించి తిరిగి స్వస్థలాలకు పంపుతున్నారు. ఇప్పటికే శ్రీగిరిపై ఉన్న అన్ని దుకాణ సముదాయాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

03/20/2020 - 07:23

హైదరాబాద్, మార్చి 19: రాజకీయ ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అధికార పార్టీ వ్యవస్థలను బెదిరిస్తోందని, దీనిని బీజేపీ గర్హిస్తోందని అన్నారు.

03/20/2020 - 07:23

హైదరాబాద్, మార్చి 19: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో రక్షిత చర్యలను చేపట్టినట్టు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చెప్పారు. గురువారం నాడు కమిషన్ కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమీక్ష చేసిన అనంతరం పలు చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు. కార్యాలయంలో పారిశుద్ధ్య పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.

03/20/2020 - 07:22

హైదరాబాద్, మార్చి 19: కరోనా వైరస్, నివారణ, రక్షణకు సంబంధించి పేదలు, గ్రామీణ ప్రజలకు సమాచారం అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గాంధీ ఆసుపత్రితో కలిసి ప్రజా రవాణా కేంద్రాలు, మురికి వాడల్లో ఒక నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Pages