S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/20/2020 - 00:44

హైదరాబాద్: శ్రీ శార్వరి తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ వేడుకలతో పాటు శ్రీరామ నవమి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ప్రగతి భవన్ ఒక చోట నుంచే పంచాంగ శ్రవణం నిర్వహించి లైవ్‌లో ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతి భవన్‌లో నిర్వహించే పంచాంగ శ్రవణానికి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించి పరిమిత సంఖ్యతో నిర్వహించనున్నారు.

03/20/2020 - 00:44

కరీంనగర్: ఇండోనేషియా నుంచి వచ్చి కరీంనగర్‌లో సంచరించిన 13 మందిలో 8 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలడంతో కరీంనగర్ జిల్లా భయంతో గజగజలాడుతోంది. ఈ నెల 14, 15న వారు రెండు రోజులు కలెక్టరేట్

03/20/2020 - 00:21

హైదరాబాద్, మార్చి 19: కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మార్చి 1 తర్వాత రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వివరాలు తెలియజేయాలని, లేని పక్షంలో ప్రభుత్వమే వివిధ మార్గాల ద్వారా గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

03/19/2020 - 12:13

కరీంనగర్‌: కరీంనగర్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. కరీంనగర్‌కు 100 ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో 20 ఐసోలేషన్‌, 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 బెడ్లను సిద్ధం చేశారు.

03/19/2020 - 06:23

హైదరాబాద్, మార్చి 18: విదేశాల నుండి వచ్చే అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో సచివాలయంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో పాటు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

03/19/2020 - 06:22

హైదరాబాద్, మార్చి 18: గిరిజనుల సమగ్ర వికాసానికి ఉపయోగపడే సంస్థలుగా ఐటీడీఏలను రూపొందించాలని గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారులతో బుధవారం ఆమె దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సమీక్షించారు. ఐటీడీఏలు గిరిజన సమగ్ర వికాస కేంద్రాలుగా భాసిల్లేలా తీర్చిదిద్దాలన్నారు.

03/19/2020 - 06:19

హైదరాబాద్, మార్చి 18: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించడానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులను పూర్తిగా పరీక్షిస్తారని ఆయన తెలిపారు.

03/19/2020 - 06:18

హైదరాబాద్, మార్చి 18: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసీఆర్ సర్కార్ అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని, ఈ విషయమై త్వరలో సీనియర్లతో చర్చించి కార్యాచరణను ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి, న్యాయ వ్యవస్థను తప్పుదోవబట్టిస్తున్నారన్నారు.

03/19/2020 - 05:43

హైదరాబాద్, మార్చి 18: సుదీర్ఘకాలం జర్నలిస్టుగా వివిధ హోదాల్లో పని చేసిన మామడి సోమయ్యకు చెన్నై యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలోని హ్యూమన్ పీఎస్ వర్సిటీ 2020 సంవత్సరానికి సోమయ్యకు జర్నలిజంలో గౌరవ డాక్టరేట్ అవార్డును ఇవ్వనున్నది. ఈనెల 28 చెన్నైలోని రాజా అన్నామలై ఆడిటోరియంలో జరగనున్న వర్సిటీ స్నాతకోత్సవాల్లో సోమయ్యకు డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నారు.

03/19/2020 - 05:41

హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర సచివాలయంలో కరోనా సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలంగాణ సెక్రటేరియేట్ అసోసియేషన్ (టీఎస్‌ఏ) ప్రభుత్వాన్ని కోరింది. టీఎస్‌ఏ అధ్యక్షుడు మాధవరం నరేందర్‌రావు, జనరల్ సెక్రటరీ షేక్ యూసుఫ్ మియా తదితరులు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు బుధవారం లేఖ అందించారు. సచివాలయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై తమ అభిప్రాయాలను వివరించారు.

Pages