S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/22/2020 - 05:02

హైదరాబాద్, మార్చి 21: రాష్ట్రంలో వడగండ్ల వానల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులను సీఎం కేసీఆర్ ఆదుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. చేతికి వచ్చిన పంటలు నేలపాలు కావడంతో రైతులు తల్లడిల్లుతున్నారన్నారు. తక్షణమే రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలన్నారు.

03/22/2020 - 05:00

హైదరాబాద్, మార్చి 21: ప్రపంచ దేశాలను వణికిస్తూ భారత్‌లోనూ చాపకింద నీరులా పారుతున్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి ఎక్కువగా వైరస్ ఉంటుండడంతో అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌కు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

03/22/2020 - 04:39

హైదరాబాద్, మార్చి 21: లండన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే ఇండియాకు రప్పిచాలని, ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ ఎన్నారై ఫోరం డిమాండ్ చేసింది. విద్యార్థులకు అండగా ఉంటామని ఫోరం పేర్కొంది. ఎమిరేట్స్, ఇతైద్ ఎయిర్ లైన్స్‌లవ నిర్లక్ష్యం, భారత్ విమాన రాకపోకల రద్దు కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి 45 మంది విద్యార్థులు లండన్‌లో చిక్కుకున్నారన్నారు.

03/22/2020 - 04:38

హైదరాబాద్, మార్చి 21: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులాల లెక్కలు తీయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో జరుగబోయే బీసీల జనగణన గర్జన మహాసభను కరోన వైరస్ వ్యాప్తి దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

03/22/2020 - 01:22

హైదరాబాద్: కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ జారీ చేసింది. ఈ జీఓను గెజిట్‌లో కూడా ప్రకటించారు. ఈ జీఓ ప్రకారం కరోనా సోకిన దేశాల నుండి ఎవరైనా తెలంగాణలో అడుగిడితే వెంటన స్టేట్ కంట్రోల్ రూం (040-2465 1119) లేదా 104కు ఫోన్ చేసి వివరాలు అందించాలని ఆదేశించారు. సమాచారం అందించిన వెంటనే ప్రభుత్వ సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకుంటుందని జీఓలో తెలిపారు.

03/22/2020 - 01:21

హైదరాబాద్: రాష్ట్రంలో అవసరమైతే ‘టోటల్ షట్‌డౌన్’ చేస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు వెల్లడించారు. ప్రగతిభవన్‌లో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, కరోనా వైరస్ తెలంగాణలో ఇప్పటివరకు అదుపులోనే ఉందన్నారు. విదేశాల నుండి వస్తున్న వారే కరోనా సోకినట్టు నిర్ధారణ అవుతున్నారన్నారు. తెలంగాణలో నివసిస్తున్న వారికి ఇప్పటివరకు కరోనా ఎఫెక్ట్ కాలేదన్నారు.

03/22/2020 - 01:20

హైదరాబాద్: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులను ఐదారు రోజుల్లో మూసివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మహారాష్టల్రో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. మహారాష్టల్రోని ధర్మాబాద్, చంద్రాపూర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలతో ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర తెలంగాణ జిల్లాల ప్రజలకు బంధుత్వాలున్నాయని ఆయన గుర్తు చేశారు.

03/22/2020 - 01:19

హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు రాష్ట్రంలోని దేవాలయాల్లో హోమాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తెలిపారు. ప్రగతి భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ‘ఆంధ్రభూమి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సీఎం జవాబు చెబుతూ, విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఆలయాల్లో హోమాలు చేస్తుంటారన్నారు.

03/22/2020 - 01:18

హైదరాబాద్: తెలంగాణలో కరోనా నిర్ధారణకు సంబంధించి శనివారం మధ్యాహ్నం వరకు 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ దవాఖానాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తన అభ్యర్థన మేరకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్

03/22/2020 - 01:16

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.

Pages