S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/22/2018 - 00:14

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పీహెచ్‌డీ పరిశోధనా పత్రాలు కేవలం వర్శిటీ లైబ్రరీలకు ఆయా డిపార్టుమెంట్ల ర్యాక్స్‌కు పరిమితం అవుతున్నాయి. శాస్తవ్రిజ్ఞాన రంగాల్లో జరిగిన పరిశోధనలు సైతం గదుల్లో బందీ అవుతున్నాయి. అనేక అంశాలపైనా, నిత్యజీవితంలో వినియోగానికి పనికొచ్చే అనేక పరిశోధనలు కేవలం పరిశోధకుడికి, మార్గదర్శకుడికి , పరిశీలకుడికి మాత్రమే పరిమితం అవుతున్నాయి.

09/22/2018 - 00:13

హైదరాబాద్, సెప్టెంబర్ 21: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనతో మంచి ఊపుమీద ఉన్న రాష్ట్ర పార్టీ అదే ఊపును కొనసాగిస్తూ తదుపరి భారీ బహిరంగ సభను కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దాని కంటే ముందు మహిళా మోర్చ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు.

09/22/2018 - 00:13

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ముందస్తు ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి ముందుగా కమిటీల లొల్లి తలనొప్పిగా మారింది. ఇంకా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎంత గందరగోళం ఏర్పడుతుందోనన్న ఆందోళన లేకపోలేదు. ముందస్తును సమర్థవంతంగా ఎదుర్కొవడానికి కాంగ్రెస్ అధిష్టానం తొమ్మిది వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

09/21/2018 - 22:35

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు గవర్నర్ పేరిట బులిటిన్ విడుదల చేసారు. శాసనసభ రద్దు అయినా శాసనమండలి యధాతధంగా కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఆరు నెలల లోపు శాసన సభ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.

09/21/2018 - 17:05

హైదరాబాద్: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో భార్య మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌ఛార్జీ కార్యదర్శ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

09/21/2018 - 05:28

నల్లగొండ, సెప్టెంబర్ 20: ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని టీ.కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను రాహుల్‌గాంధీ మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్‌గా, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా నియమించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

09/21/2018 - 05:27

అల్లాదుర్గం, సెప్టెంబర్ 20: తెలంగాణ ప్రజలకు భయపడే ముందస్తు ఎన్నికలు తెచ్చారని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మండల కేంద్రమైన అల్లాదుర్గంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో అల్లాదుర్గం జడ్పీటీసీ మమత బ్రహ్మం కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

09/21/2018 - 05:25

మిర్యాలగూడ, సెప్టెంబర్ 20: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్ హత్యోదంతం మరచిపోక ముందే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.

09/21/2018 - 05:23

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 20: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్ హత్య విషయంలో పోలీసలు మరింత జాగ్రత్తగా వ్యవహరించి చార్జీషీటు రూపొందించాలని హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలో ప్రణయ్‌కుమార్ ఇంటికి వచ్చి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించి సంతాపం, సానుభూతిని ప్రకటించారు. వారితో సుమారు గంట సేపు మాట్లాడారు.

09/21/2018 - 05:21

నిజామాబాద్, సెప్టెంబర్ 20: రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తూ, హేమాహేమీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల్లో విజయం సాధించడం అధికార తెరాస పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.

Pages