-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
సూర్యాపేట, సెప్టెంబర్ 22: ఓట్ల కోసం వెంపర్లడుతూ డ్రామాలు చేసే నాయకుడ్ని కాదని.. ప్రజల మేలు కోసం, అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషిచేసే నైజం తనదంటూ మంత్రి జగదీశ్రెడ్డి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణవల్ల నిర్వాసితులుగా మారే వ్యాపారులు, బాధితులు శనివారం స్ధానిక క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: ప్రతి ఏటా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు మిగిలిపోవడం, కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు జరగడంతో కాలేజీల మూసివేత, విద్యార్థుల ఆందోళన, వారిని వేరే కాలేజీల్లో సర్దుబాటు చేయడం వంటి సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా , కాలేజీలను పూర్తిగా వేసే బదులు ఇక మీదట మిగిలిన కాలేజీల్లో వాటిని విలీనం చేసే ఆలోచనను ఎఐసీటీఈ పరిశీలిస్తోంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఏ లక్ష్యంతో ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ను తీసుకువచ్చిందో చెప్పాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్ ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం ఆదరబాదరాగా ఆ ఆర్డినెన్స్ను తీసుకురావడం వెనుక ఓట్ల వేట లేదా అని ప్రశ్నించారు.
ధర్మపురి, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా ఉన్న కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అనుకున్నదాన్ని సాధించడంతో ఏనాడూ రాజీపడలేదు. పదవులకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనకు పలువురితో కలిసి శ్రీకారం చుట్టిన నాటి నుంచి ఆయనది అదే ధోరణి. మూడు భాషల్లో అనర్ఘళంగా, అలవోక, సమయానుకూలంగా ప్రసంగించే మాటల మాంత్రికుడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: విజయమే లక్ష్యంగా బిజెపి ఇంటింటి ప్రచారం చేస్తుందని బీజేపీ శాసనసభాపక్ష మాజీ నేత కిషన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటింటికీ బీజేపీ కార్యకర్తలు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, దేశంలో నరేంద్రమోదీ పాలన గురించి వివరిస్తారని అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: సంప్రదాయంగా వస్తున్న ఐటీ వృత్తులు కనుమరుగవుతున్నాయి. కంపెనీలు అభివృద్ధిని సాధించడం కోసం ఏఐ, ఇతర లోతైన సాంకేతికతల వైపు చూస్తున్నాయి.
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అనూష అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని వెల్లడించింది. అనూష స్వస్థలం సిద్ధిపేట జిల్లా మందపల్లిగా గుర్తించారు.
హైదరాబాద్: దేశంలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని బీజేపీ నేత కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వాటిని మరిచిపోయి ఉండవచ్చని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ నిజాయితీ గురించి దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రాహుల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు కితాబులు అవసరం లేదని చెప్పారు.
హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద కుంభకోణం రాఫెల్ విమానాల కొనుగోలులో జరిగిందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో కుంభకోణం జరిగినట్లు వెల్లడైందని అన్నారు. దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ రాజీనామా చేయాలని అన్నారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి న్యాయస్థానం మళ్లీ రిమాండ్ విధించింది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు జగ్గారెడ్డిని జైలుకు తరలించారు. నేటితో రిమాండ్ గడువు ముగియడంతో జగ్గారెడ్డిని తిరిగి న్యాయస్థానంలో హాజరు పర్చగా తిరిగి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.