S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/20/2018 - 12:47

ఆర్మూర్: ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం సిద్ధుల గుట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

09/20/2018 - 12:46

కరీంనగర్: కరీంనగర్‌లోని టెలిఫోన్ భవన్‌లోకి ఎలుగుబంటు ప్రత్యక్షమవ్వటంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సిబ్బంది స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటును పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించారు.

09/20/2018 - 05:27

నల్లగొండ, సెప్టెంబర్ 19: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులపై నియోజకవర్గాల్లో ఎదురవుతున్న అసమ్మతి సద్ధుమణుగకపోగా అసమ్మతివాదులు భారీ ర్యాలీలు, పోటీ సభలతో రెబెల్‌గా బరిలోకి దిగుతామని ప్రకటిస్తూ.. అభ్యర్థులను మార్చాలంటూ అధిష్ఠానానికి ఆల్టిమేటంలతో దూసుకెళ్తున్నారు.

09/20/2018 - 05:26

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెరాస ప్రచారంలో చుక్కెదురైంది. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గం మార్చాల గ్రామంలో కల్వకుర్తి తెరాస అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రచారానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రచారంలో భాగంగా మార్చల గ్రామంలో ప్రచార సభను నిర్వహించారు. వివిధ పార్టీలకు సంబందించిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు.

09/20/2018 - 04:15

మిర్యాలగూడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురై వందల మంది చనిపోయినా.. కుల దురహంకార హత్యలకు గురైనా వారిని పరామర్శించిన, కనికరించిన పాపాన పోలేదని అపద్ధర్మ సీఎం కేసీఆర్ పోలేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు.

09/20/2018 - 04:12

మంచిర్యాల, సెప్టెంబర్ 19: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో జరిగిన సంఘటనల్లో రేగుంట గట్టయ్య మృతితో ఇందారం గ్రామంలో విషాదం అలుముకుంది. ఉద్రిక్తత నడుమ గట్టయ్య అంతిమ వీడ్కోలు బుధవారం జరిగింది.

09/20/2018 - 04:10

హైదరాబాద్, సెప్టెంబర్ 19: పంచాయితీ కార్యదర్శులకు (గ్రేడ్-1) వీడీఓల తరహాలో ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వీడీఓలకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ వీరిని మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాల్లో నియమిస్తున్నారు. పంచాయితీ కార్యదర్శులు జీవితాంతం అదే పోస్టులో కొనసాగాల్సి వచ్చేది.

09/20/2018 - 04:10

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకు భూముల సేకరణకు సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ల్యాండ్ అక్విజేషన్ యూనిట్లకు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమిస్తోంది. ఐ అండ్ క్యాడ్ శాఖకు వీరు సహాయంగా ఉంటారు. దాదాపు అన్ని జిల్లాలకు డిప్యూటీ కలెక్టర్లను నియమించారు.

09/20/2018 - 04:09

హైదరాబాద్, సెప్టెంబర్ 19: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలు అందుకోలేనంత వేగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కలిసోచ్చే ఇతర విపక్షాలతో మహాకూటమి ఏర్పాటుకు ఇంకా మీనమేషాలు లెక్కబెడుతుండగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

09/19/2018 - 13:35

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మినీ ముత్తూట్ ఫైనాన్స్ దుకాణంలో చోరీకి పాల్పడిన నలుగురు దోషులకు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ రూ.10 వేలు జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. తాము సీబీఐ అధికారులమంటూ నిందితులు మినీ ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ. 12 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దోషులకు జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా కూడా విధించారు.

Pages