-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేకుంటే గులాంనబీ ఆజాద్ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటికి ఎందుకువచ్చారని ఎంపీ బి వినోద్కుమార్ ఘాటుగా స్పందించారు. ఆజాద్ వ్యాఖ్యలకు తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 21 : సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏకగ్రీవ తీర్మాన సభలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్వేగభరితంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి హరీష్రావుకు గ్రామస్థులు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికారు.
భిక్కనూరు, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకులను చూసి చలించి పోయిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారనీ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురి కోసం కాదని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ ధ్వజమెత్తారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని.. కేసీఆర్ ఆమరణ దీక్ష.. ప్రజలు పోరాటంతో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానంటేనే..
చింతపల్లి, సెప్టెంబర్ 21: తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు వారి అభీష్టం మేరకు దేవరకొండ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం టీఆర్ఎస్కు గుడ్బై కొట్టి ఈ నెల 26న కాంగ్రెస్లో చేరేందుకు నిర్ణయించుకున్నానని జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ ప్రకటించారు.
కరీంనగర్, సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం వేకువఝాము నుంచి రాత్రి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొన్ని చోట్ల చిరు నుంచి ఓ మోస్తారుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సామాన్య జనజీవనం కొంతమేర స్తంభించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 21: కేసీఆర్ కుటుంబానికి మహాకూటమి భయం పట్టుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు పార్టీ నేతలతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన చేతకాక తిరిగి ఆశీర్వదించమని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెబుతారేమోనని సభలకు వచ్చిన ప్రజలకు నిరాశ ఎదురవుతోందని అన్నారు.
జగిత్యాల, సెప్టెంబర్ 21: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు భారీ వర్షం కురువగా కరీంనగర్ - నిజామాబాద్ ప్రధాన రహదారి వట్టివాగు కొట్టుకుపోయి వంతెనపై నుండి నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఖమ్మం, సెప్టెంబర్ 21: ప్రజల ఆత్మగౌరవమే ఎజెండాగా ఎన్నికల బరిలోకి దిగుతామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కూడా ప్రజల నుంచి ఆత్మగౌరవ నినాదమే వినిపించిందన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ 1969లో తెలంగాణ ఉద్యమంలో 369 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు. 2004 నుండి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకాలు అందరికీ తెలుసని చెప్పారు.