-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూలై 14: పాడి రైతులకు సబ్సిడీపై గేదెలను అందించే బృహత్తర కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర పశు సంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, జూలై 14: ఉన్నత విద్యా కమిషన్ ప్రతిపాదనను విరమించుకోవాలని హైదరాబాద్కు చెందిన మేథావుల ఫోరం కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ను కోరింది. ఈ మేరకు విద్యావేత్తలు, విద్యా నిపుణుల, మేథావుల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి కేంద్ర మంత్రి జవదేకర్కు పంపిస్తున్నట్టు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ అనాలసిస్ (సీరా) కన్వీనర్ ఎన్ నారాయణ చెప్పారు.
న్యూఢిల్లీ, జూలై 14: ఆంధ్రప్రదేశ్లో భారతీయ జానతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు ఫిర్యాదు చెయ్యనున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. కన్నా శనివారం ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్లను కలిశారు.
హైదరాబాద్, జూలై 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు నిర్వహించాలని టీఎన్ఎస్ఎఫ్ సమావేశంలో నిర్ణయించారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్భ్వన్లో తెలుగు యువత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరేందర్ గౌడ్, దీపక్ రెడ్డిల ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
హైదరాబాద్, జూలై 14: తెలంగాణ రాష్ట్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విద్యను గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని వివిధ విశ్వవిద్యాలయాలకు పనిచేసిన మాజీ వైస్ ఛాన్సలర్లు అభిప్రాయపడ్డారు. చాలా కాలం పాటు రీడర్లు, ప్రొఫెసర్లుగానూ, వైస్ ఛాన్సలర్లుగా పనిచేసిన దాదాపు డజనుమంది విద్యావేత్తలు తెలంగాణ రాష్ట్ర మాజీ వీసీల ఫోరం పేరిట ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు.
హైదరాబాద్, జూలై 14: ప్రజా సమస్యలపై ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు?, పోలింగ్ కేంద్రాల వారీగా కమిటీల నియామకాలు ఎంత వరకు వచ్చాయి? అని తెలంగాణకు నియమితులైన ఎఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్ అసెంబ్లీ సమన్వయకర్తలను ప్రశ్నించారు. శనివారం అహ్మద్ మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నల్లగొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పరిథిలోని ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు.
హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా కొనసాగుతున్న వారినే పర్సన్-ఇంచార్జీలుగా నియమించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న కోరారు. భూమన్నతో పాటు పలువురు సర్పంచ్లు శనివారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించవద్దని కోరారు.
న్యూఢిల్లీ, జూలై 14: దేశ రాజధాని ఢిల్లీలో జూలై 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని లాల్ దర్వాజా ఆలయ కమిటీ వెల్లడించింది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా ఆలయ కమిటి మాజీ అధ్యక్షుడు జీ. మహేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు కే. వెంకటేష్, కోశాధికారి జీ.
నల్లగొండ: సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల గెలుపు ఓటములపై తాజాగా నిర్వహించిన సర్వేల కథనాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అలజడి రేపాయి.
మహబూబ్నగర్, జూలై 13: సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని.. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు పలు హామీలు ఇచ్చారని వాటిని నేరవేర్చాల్సిన అవసరం ఉందని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజే యూ) మహబూబ్నగర్ జిల్లా ప్రథమ మహాసభలు నిర్వహించారు.