-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
వరంగల్ క్రైం, జూలై 12: ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కొప్పు శరత్కు గురువారం ఇక్కడ అశ్రునయనాల మధ్య అంత్య క్రియలు జరిగాయ. అక్కడికి వెళ్లిన ఆరు నెలలకే శరత్ మృతి చెందడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోతోంది. కాన్సస్ సిటీలోని ఓ రెస్టారెంట్లో గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో శరత్ మృతి చెందిన సంగతి తెలిసిందే.
వరంగల్, జూలై 12: నగరంలోని 4వ తేదీ కోటిలింగాల వద్ద ఉన్న భద్రకాళీ ఫైర్ వర్క్స్లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన 10మంది మృతుల కుటుంబాలకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబానికో 5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు ఒక్కో కుటుంబానికి డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసారు.
హైదరాబాద్, జూలై 12: ఎన్ఎస్యూఐ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు గురువారం గాంధీభవన్ ముందు నిరసన చేపట్టారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వినయ్ పటేల్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు గాంధీ భవన్ ప్రధాన ద్వారం వద్ద నిరసనకు దిగారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యకలాపాలు సాగేలా చూడాలని కోరారు.
హైదరాబాద్: వివిధ సామాజికవర్గాలకు చెందిన ప్రజలకు ప్రభుత్వం గొర్రెలను, చేపలనిచ్చినా, తాము సంతోషిస్తామని, బీసీల సంక్షేమానికి సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తొందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతం చేయాలని, దీని వల్ల బీసీల జనాభా ఎంత ఉందో బయటపడుతుందని అన్నారు.
జగిత్యాల, జూలై 12: సీఎం కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ, మరోవైపు వెయ్యి కోట్ల ఆర్థిక భారం నెపంతో ‘ప్రాణహిత’ కనుమరుగు చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత టీ. తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. 2019 ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్దేనంటూ ప్రాణహితకు జీవం పోస్తామని అన్నారు.
హైదరాబాద్, జూలై 12: శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి బహిష్కరించి రెండు రోజులు గడవకముందే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి కూడా బహిష్కరించారు. ఇందుకు సంబంధించి ఇరు కమిషనరేట్లు పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశాయి. ఆరు నెలల పాటు కమిషనరేట్ల పరిధి నుంచి బహిష్కరించామని, గడువులోగా వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 12: ప్రభుత్వ కాలేజీల్లో చదివి ఇంటర్మీడియట్లో టాపర్లుగా నిలిచిన వారిని ఇంటర్ బోర్డు శుక్రవారం నాడు సత్కరించనుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ హాజరుకానున్నారు.
హైదరాబాద్, జూలై 12: తెలంగాణలో రెండో దశ ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీం సీట్ల కేటాయింపు ప్రక్రియను గురువారం నాడు పూర్తి చేసినట్టు కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. కన్వీనర్ కోటాలో 69,221 సీట్లు ఉండగా, రెండోదశ కౌనె్సలింగ్ సమయానికి 31,082 సీట్లు ఖాళీగా ఉన్నాయని, రెండో దశ కౌనె్సలింగ్ అనంతరం 51,345 సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు.
హైదరాబాద్, జూలై 11: కాలేజీలు మొదలై నెలరోజులు కావస్తున్నా కాంట్రాక్టు లెక్చరర్ల నియామక ప్రక్రియ పూర్తికాలేదు. కొంత మంది ఇప్పటికే చేరినా, ఇటీవల జరిగిన రెగ్యులర్ లెక్చరర్ల పదోన్నతులు, బదిలీలతో కాంట్రాక్టు లెక్చరర్లకు స్థానభ్రంశం కల్పించిన అధికారులు ఇంకా వారిని నియమించలేదు.
హైదరాబాద్, జూలై 11: గనులశాఖ నుంచి అనుమతులు ఇక నుంచి ఆన్లైన్లో పొందవచ్చని గనులశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. గనులశాఖలో అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే అమలు చేస్తోన్న ఆన్లైన్ సేవలకు అదనంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకోస్తున్నామన్నారు.