S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/14/2018 - 02:41

జగిత్యాల, జూలై 13: సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకే కాదు.. ప్రపంచ న్యాయస్థానానికి వెళ్లినా న్యాయం జరగదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎలుగందుల రమణ స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో రమణ మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంతోపాటు సామాజిక న్యాయం అందించాలనే ఆలోచనతో ముందుకెళ్తే..

07/14/2018 - 02:39

నర్సంపేట, జూలై 13: టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందే తప్ప ఆతర్వాత వచ్చిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూ రి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

07/14/2018 - 02:37

ఆర్మూర్, జూలై 13: రైతుల అభివృద్ధి కోసం వారు పం డించే వివిధ పంటలకు గిట్టుబాటు ధరను గణనీయంగా పెంచామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం చెప్పారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ పేరుతో అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో రైతులు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లకుండా ఉండే పరిస్థితులు తీసుకురావడానికి ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు.

07/14/2018 - 02:35

కేసముద్రం, జూలై 13: ఆయనకు 80 ఏళ్లు.. భార్య రెండేళ్ల క్రితం కన్ను మూసింది.. ఆమెకు 55 ఏళ్లు.. ఆమె భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో కన్ను మూసాడు. ఇద్దరికీ సంతానం ఉన్నా ఎవరు పట్టించుకోక పోవడంతో తోడు కోసం వెతుకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ పరిచయం ఉన్న ఓ వ్యక్తి వీరిద్దరిని ఒక్కటి చేసేందుకు నాలుగు మాసాల క్రితం పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి..

07/14/2018 - 02:19

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వ శాఖలు సన్నద్ధం అవుతున్నాయి. నాల్గొవ విడత హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. అందుకు అనుగుణంగా అటవీ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే మూడు విడతలుగా సాగిన కార్యక్రమాల్లో 81.60కోట్ల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు.

07/14/2018 - 02:27

హైదరాబాద్: బోధన్ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై ఇచ్చిన అవిశ్వాస నోటిసును వెనక్కి తీసుకోవడానికి కౌన్సలర్లు అంగీకరించారు. టిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన కౌన్సలర్లు మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసానికి నోటీసు ఇవ్వడంతో నిజామాబాద్ ఎంపి కవిత రంగంలోకి దిగారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీతో శుక్రవారం కవిత భేటీ అయ్యారు.

07/14/2018 - 02:14

హైదరాబాద్, జూలై 13: తీవ్రమైన గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్న ఓ వృద్దురాలికి ఇండో-యూఎస్ ఆసుపత్రి వైద్యులు అత్యంత అరుదైన గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. శుక్రవారం నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను శస్తచ్రికిత్స నిపుణులు శేషగిరి రావు వెల్లడించారు.

07/14/2018 - 01:15

హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యకు కొత్త రూపాన్ని ఇచ్చామని, అన్ని సర్వీసులను ఆన్‌లైన్ చేశామని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లొ సకల సౌకర్యాలను కల్పించామని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శుక్రవారం నాడు ఆయన బంగారు పతకాలను, ప్రశంసాపత్రాలను అందజేశారు.

07/14/2018 - 00:18

హైదరాబాద్, జూలై 13: పరిశోధనా సంస్థలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రజలతో మమేకం కావాలని, ఒంటరిగా ఉండరాదని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన నిజాంపేట ప్రగతి నగర్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శాస్తవ్రేత్తలతోనూ ముచ్చటించారు.

07/14/2018 - 00:17

హైదరాబాద్, జూలై 13: గిరిజన పారిశ్రామికవేత్తలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరమ్ అన్నారు. గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న కార్యక్రమాలకు కూడా చేయూత ఇస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జాతీయ గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది.

Pages