S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సినిమాల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలా నిలదొక్కుకోవాలంటే ప్రతిభ ఎంతో ముఖ్యం. అలాంటి ప్రతిభతోనే అడుగులు ముందుకేసింది అందాలతార ప్రియాంక చోప్రా. ఈ బ్యూటీ ప్రతిభకు తోడు అందం... అభినయం కూడా తోడయ్యింది. అంతటితో ఆగకుండా బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ అడుగుపెట్టి సంచనలం సృష్టించింది. చేసిన చిత్రాలు, పోషించిన పాత్రలు ఆమె ప్రతిభను ప్రేక్షకుల ముందుంచాయి.
‘‘చాలా మంది అనుకుంటుంటారు నటీనటుల వారసులకు పరిశ్రమలో అవకాశాలకు కొదువేలేదని. కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదు. ప్రారంభంలో అవకాశాలు మాత్రమే వస్తాయి. కానీ వాళ్లలా అనుకున్నంత పేరు, ప్రఖ్యాతులు అంత తొందరగా రానే రావు’’ అంటోంది సోహా అలీఖాన్. అలనాటి నటి షర్మిలా ఠాగూర్ కుమార్తెగా, నటుడు సైఫ్ అలీఖాన్ సోదరిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన సుందరి సోహా అలీఖాన్. కానీ తల్లి..
వరుస అవకాశాలతో బాలీవుడ్లో రివ్వున దూసుకెళుతోంది క్రేజీతార అలియా భట్. యువతరం ప్రేక్షకుల్లో ఆమెకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. పేరున్న హీరోలు.. అంతకంటే పాపులారిటీ వున్న బ్యానర్లు.. ఇవి అలియాకు కెరీర్లో బాగా కలిసొచ్చాయి. ఇదిలా వుండగా ఈ క్రేజీతార తాజాగా తన మకాం మార్చేసింది. ఈ భామ ఇటీవలే ముంబయిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.
-అంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్. ఇటీవలి కాలంలో ఈ భామపై వచ్చినన్ని రూమర్స్ మరే తారపై రాలేదంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. కెరీర్లో ఎదుగుతున్న కథానాయికలతో పాటు, అప్పుడప్పుడే వచ్చి క్రేజ్ని సంపాదించుకున్న అందాలతారలపై పుకార్లు షికారు చేస్తుండటం మనం చూస్తున్నదే. కెరీర్లో కాస్త పేరు రాగానే ఇలాంటివి మామూలే.
విజయనగరం, నవంబర్ 18: రబీ సీజన్లో ఫసల్ బీమా ప్రీమియం చెల్లించేందుకు వచ్చే నెలాఖరు వరకు గడువు ఉంది. రబీ సీజన్లో వేసే పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో రైతులకు మేలు జరగనుంది. రబీలో వేసే పంటలకు కరవు, తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ బీమాద్వారా రైతులకు రక్షణ కలగనుంది. మొక్కజొన్న పంటకు గ్రామం యూనిట్గా లెక్కిస్తారు. ఇతర పంటలకు మండలం యూనిట్గా పరిగణిస్తారు.
విజయనగరం, నవంబర్ 18: జిల్లాలో వంద రూపాయల నోట్ల కొరతను అధిగమించేందుకు మినీ ఎటిఎంలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్బిఐ, ఇతర బ్యాంకులు 150 వరకు ఎటిఎంలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఖాతాదారులకు రూ.2వేలు అందజేస్తున్న వాటికి చిల్లర దొరక్క అవస్ధలు పడుతున్న విషయం విధితమే. దీంతో చిల్లరకు సామాన్య ప్రజానీకం అవస్థలు పడుతున్నారు.
బొండపల్లి, నవంబర్ 18: ఆండ్ర జలాశయం నుండి ఎంఎన్ ఛానల్ ద్వారా రైతులకు సాగు నీరు అందించాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం బొండపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో రైతుల నుండి సంతకాలు సేకరించి పాదయాత్ర నిర్వహించారు.
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 18: మున్సిపాలిటీలో 13వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన నిధుల వినియోగానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ పాలకవర్గం బ్రేక్లు వేసింది.
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 18: గ్రామస్థాయిలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్న సహకార కేంద్ర బ్యాంకులలో 500, 1000 రూపాయల నోట్ల మార్పిడి లావాదేవీల నిలుపుదలను ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పాడ ఉమామహేశ్వరరావు అన్నారు.
బొండపల్లి, నవంబర్ 18: గజపతినగరం నియోజకవర్గంలో ఎవరు అవినీతిపరులో ప్రజలకు తెలుసునని మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని కొత్తపాలెం, జె.గుమడాం గ్రామంలో గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు.