S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 06:43

హైదరాబాద్, జూలై 30: నటనతోనే కాదు.. తనను ఆదరించే అభిమానుల ఆకాంక్షనూ తీర్చడంలోనూ తనకు తానే సాటిగా నిరూపించుకున్నారు. యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. తనను కలవాలనుకున్న ఓ క్యాన్సర్ రోగిని పలకరించారు. అంతేకాకుండా తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులనూ కలుసుకునే అవకాశం కల్పించారు. బెంగుళూరుకు చెందిన నాగార్జున ఎప్పటికైనా తన అభిమాన హీరో ఎన్టీఆర్‌ను కలవాలన్నది అతని కోరిక.

07/31/2016 - 06:42

ఒక ఊళ్లో పేరయ్య అనే ఓ పేదవాడుండేవాడు. అతనికి భార్య, ఓ నాలుగేళ్ల కూతురు. కూలో నాలో చేసుకుంటూ సంపాదించిన రోజు కూలీ డబ్బులతో హాయిగా కుటుంబాన్ని పోషించుకునే వాడు. గుడిసె జీవితమైనా.. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, నేటికి కరువు లేదు, రేపటికి రంధి లేదు. అరమరికలు లేని జీవితం. కాయకష్టం మీద బ్రతుకు. రోజు మట్టి పని. ఒక రోజు గుంతలు తీస్తుంటే గడ్డపారకు ఏదో తగిలి ‘ఖన్’మని శబ్దమయ్యింది.

07/31/2016 - 06:38

హోస్టన్, జూలై 30: అమెరికాలోని మధ్య టెక్సాస్‌లో ఎయిర్ బెలూన్ మంటల్లో చిక్కుకోవటంతో 16మంది మరణించారు. లోఖార్ట్ సమీపంలో 16మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ బెలూన్‌కు అకస్మికంగా మంటలు వ్యాపించి పొలాల్లో పడిపోయింది. సరిగ్గా హై వోల్టేజి విద్యుత్ లైన్లు ఉన్న ప్రాంతంలో బెలూన్ దగ్ధమైంది.

07/31/2016 - 06:37

విజయవాడ, జూలై 30: గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలను ఒక అనుభవంగా తీసుకుని కృష్ణా పుష్కరాలలో ఏ ఒక్క యాత్రికుడు కూడా ప్రవేశం నుంచి తమ తమ గమ్యాలకు చేరేవరకు కూడా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం అన్ని స్థాయిల్లోనూ పోలీస్, రెవెన్యూ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయనున్నాయన్నారు.

07/31/2016 - 06:34

ఒక ఊళ్లో పేరయ్య అనే ఓ పేదవాడుండేవాడు. అతనికి భార్య, ఓ నాలుగేళ్ల కూతురు. కూలో నాలో చేసుకుంటూ సంపాదించిన రోజు కూలీ డబ్బులతో హాయిగా కుటుంబాన్ని పోషించుకునే వాడు. గుడిసె జీవితమైనా.. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, నేటికి కరువు లేదు, రేపటికి రంధి లేదు. అరమరికలు లేని జీవితం. కాయకష్టం మీద బ్రతుకు. రోజు మట్టి పని. ఒక రోజు గుంతలు తీస్తుంటే గడ్డపారకు ఏదో తగిలి ‘ఖన్’మని శబ్దమయ్యింది.

07/31/2016 - 06:31

మద్దిపాడు, జూలై 30: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెంకట రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మద్దిపాడు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

07/31/2016 - 06:30

విజయనగరం, జూలై 30: అనైతికంగా, అన్యాయంగా జరిగిన విభజన కారణంగా అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో, ప్రత్యేక హోదా, నిధులు, పథకాల మంజూరులో కేంద్ర ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదని జిల్లా ఇన్‌చార్జి, సమాచార, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేసారు. అలా అని కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపడే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు.

07/31/2016 - 06:28

అనంతపురం, జూలై 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తిరుగుబాటు తప్పదని పిసిసి అధ్యక్షుడు రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పునరుద్ఘాటించారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులు హోదా కోసం పార్లమెంటువైపు ఆశగా చూస్తున్నారన్నారు. శనివారం అనంతపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దురదృష్టం కొద్దీ రాష్ట్ర విభజన జరిగిందన్నారు.

07/31/2016 - 06:25

విశాఖపట్నం, జూలై 30: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు పెరుగుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ వైఖరి, పోలవరం ప్రాజెక్టు అంశం నేపథ్యంలో ఎపి, ఒడిశాలో బలోపేతమయ్యే దిశగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నట్టు కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగం సమాచారం. గతేడాది ఎపిలో మావోయిస్టు కార్యకలాపాలు 94 శాతం పెరిగినట్టు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

07/31/2016 - 06:25

నెల్లూరుసిటీ, జూలై 30: నెల్లూరు నగరపాలక సంస్థలోని సిటీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, 3 టిపిఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర టౌన్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ రఘు శుక్రవారం రాత్రి 7 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుతో పాటు వారి స్థానంలో కొత్తవారిని కూడా యుద్ధ ప్రతిపాదికన నియమించడం విశేషం.

Pages