S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2016 - 00:29

ఆకివీడు, డిసెంబర్ 5: కంచి పీఠాధిపతి జయేంద్రసరస్వతి, ఉత్తరాధికారి విజయేంద్రసరస్వతి సోమవారం అయి భీమవరంలోని చంద్రశేఖరేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున మహిళాభక్తులు స్వామీజీల అశీస్సులు అందుకున్నారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.

12/06/2016 - 00:28

రోమ్, డిసెంబర్ 5: ఇటలీ ప్రజలు అనూహ్యరీతిలో ప్రధాని ఆకాంక్షకు విరుద్ధంగా తీర్పునిచ్చారు. రాజ్యాంగంలో చట్ట సంస్కరణలు సరికాదన్న అభిప్రాయాన్ని ఆదివారం జరిగిన రెఫరెండమ్‌లో స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న ఈ రెఫరెండమ్‌లో మెజారిటీ ప్రజలు రాజ్యాంగ సంస్కరణొద్దు అంటూ ఓటేయడంతో సోమవారం ఇటలీ ప్రధాన మంత్రి మట్టెయో రేంజి రాజీనామా చేశారు.

12/06/2016 - 00:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: బహుళజాతి సంస్థలుగా ఎదగాలని భారతీయ ఇంధన సంస్థలకు పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశ ఆర్థికాభివృద్ధికి సుస్థిర, నిలకడైన ఇంధన ధరలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా, భారతీయ ఇంధన అవసరాల్లో మెజారిటీ శాతం విదేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

12/06/2016 - 00:22

ముంబయి, డిసెంబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 118.44 పాయింట్లు పెరిగి 26,349.10 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 41.95 పాయింట్లు ఎగిసి 8,128.75 వద్ద నిలిచింది.

12/06/2016 - 00:22

ముంబయి, డిసెంబర్ 5: టాటా సన్స్ నేతృత్వంలో నడుస్తున్న ట్రస్టులను సంస్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తి కోరారు. టాటా సన్స్ నిర్ణయాలు విశ్వసనీయంగా లేవని, సరైన నాయకత్వం లేదని అన్నారు. ఈ నెల 13న టాటా గ్రూప్ సంస్థల్లో అతిపెద్దదైన టిసిఎస్‌కు సంబంధించి ఇజిఎమ్ జరుగుతున్న క్రమంలో సోమవారం మిస్ర్తి పైవిధంగా స్పందించారు.

12/06/2016 - 00:20

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సోమవారం హైదరాబాద్‌లో 50 లక్షల రూపాయల చెక్కును అందజేస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, తదితరులు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఈ చెక్కును అందించారు.
చిత్రంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా ఉన్నారు

12/06/2016 - 00:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్, ఈ-పేమెంట్లను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సప్లయర్స్, కాంట్రాక్టర్లు లేదా సంస్థలకు జరిపే చెల్లింపులు 5,000 రూపాయలను మించితే నగదు రూపంలో ఇవ్వరాదని, ఎలక్ట్రానిక్ విధానంలోనే పేమెంట్లు జరపాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.

12/06/2016 - 00:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్.. సోమవారం ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పరిమితస్థాయి ఉచిత డేటా వినియోగంతో నెట్‌పై 3 నెలల అపరిమిత కాల్స్‌ను ముందుకుతెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకూ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. 148 రూపాయలకే ఈ ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది.

12/06/2016 - 00:15

న్యూఢిల్లీ, డిసెంబరు 5: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థికంగా చిక్కుల్లోపడిన కోళ్ళ పరిశ్రమను అదుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లిని తెలంగాణ పౌల్ట్రీ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంపి జితేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పౌల్ట్రీ సంఘం నాయకులు రంజిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రమేష్, సినినిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఆర్థిక మంత్రితో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు.

12/06/2016 - 00:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: నిస్సాన్ మోటార్ దేశీయ అమ్మకాలు గత నెల నవంబర్‌లో 52 శాతం పెరిగాయి. ఈసారి 3,975 యూనిట్లు అమ్మితే, నిరుడు నవంబర్‌లో 2,617 యూనిట్లను విక్రయించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో నిస్సాన్ మోటార్ తెలిపింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కరెన్సీ కొరత ఉన్నప్పటికీ సంస్థ కార్ల అమ్మకాలు పెరగడంపట్ల నిస్సాన్ ఆనందం వ్యక్తం చేసింది.

Pages