-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం, సెప్టెంబర్ 20: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యపై ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ స్పందించారు.
విజయవాడ, సెప్టెంబర్ 20: అధికారమే పరమావధిగా, వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీకి ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఎలాంటి సిద్ధాంతాలు, విధానాలు లేవని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. జగన్ పార్టీ ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్ పార్టీ బీజేపీతో కుమ్మకైందని లోకమంతా నమ్ముతోందన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 20: పే రివిజన్ కమిషన్ వేతన సవరణకై కసరత్తు ప్రారంభించబోతున్న నేపథ్యంలో తగు ప్రతిపాదనలు అందచేసేందుకుగాను ముందస్తు చర్చకై తక్షణం పే కమిటీని ప్రకటించాలని కోరుతూ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అధ్యక్షుడు వైవీ రావు, తదితరులు గురువారం సంస్థ చైర్మన్ వర్లరామయ్య, ఎండీ ఎన్వీ సురేంద్రబాబులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
విజయవాడ, సెప్టెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి యువత నుంచి అమోఘమైన ఆదరణ లభిస్తోంది. అర్హులైన నిరుద్యోగ యువత ఈ పథకం ద్వారా భృతి పొందడం కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14న ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్ను ప్రారంభించారు.
గుంటూరు, సెప్టెంబర్ 20: ముమ్మారు తలాక్ విషయంలో కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ శాసనమండలి సభ్యుడు, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్ స్పష్టంచేశారు.
విజయవాడ, సెప్టెంబర్ 20: తిరుపతిలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు చైనాకు చెందిన టీసీఎల్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు చైనాలోని షేనే్జన్లోలో ఆ కంపెనీ సీఈవో కెవిన్ వాంగ్తో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ గురువారం భేటీ అయ్యారు. అనంతరం తిరుపతిలో కంపెనీ ఏర్పాటు వీలుగా ఆ కంపెనీ, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ శాఖల మధ్య ఒప్పందం చేసుకున్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 20: అధికారులు మరింత నిమగ్నమై, ఎక్కువ దృష్టి కేంద్రీకరించి శ్రద్ధతో పని చేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గురువారం ఉదయం వెలగపూడి సచివాలయంలో విభాగాధిపతులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేగా నిధులను 22 శాఖలు ఉపయోగించుకున్నాయని, మిగిలిన శాఖలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాయని ప్రశ్నించారు.
కాకినాడ, సెప్టెంబర్ 20: అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ రెండు ప్రాంత ప్రజల్లో విభజన బీజాలు నాటుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో గురువారం జరిగింది.
అవుకు, సెప్టెంబర్ 20: గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువకు అవుకు రిజర్వాయర్ నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అవుకు టనె్నల్ను జలవనరులశాఖ సిద్ధం చేసింది. 12 ఏళ్ల క్రితం టనె్నల్ పనులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 401 కోట్ల వ్యయంతో ఎన్సీసీ, మైథాస్ జాయింట్ సంస్థ ఈపీసీ విధానం ద్వారా ఈ పనులు దక్కించుకుంది.
నెల్లూరు, సెప్టెంబర్ 20: నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘంలో సభ్యునిగా నియమించినట్లు రాజ్యసభ సచివాలయం నుండి గురువారం ఆయనకు ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ తనకు సభ్యునిగా అవకాశం కల్పించినందుకు రాజ్యసభ చైర్పర్సన్ వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలియచేశారు.