S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/23/2018 - 04:08

పిఠాపురం, సెప్టెంబర్ 22: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన వాఖ్యలు సరికాదని, పోలీసులు సమర్థవంతంగానే పనిచేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రూ.90 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక భవనాన్ని ఫైర్ డీజీ సత్యనారాయణ, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మతో కలిసి శనివారం ఆయన ప్రారంభించి అనంతరం విలేఖర్లతో మాట్లాడారు.

09/23/2018 - 04:02

విజయనగరం, కొత్తవలస, సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీని దుర్భాషలాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇపుడు అదే పార్టీతో ఎలా జతకట్టారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శనివారం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన జగన్ పర్యటన గురించి, టీడీపీ పాలన గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అంకెల గారడీ తప్ప జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు.

09/23/2018 - 02:21

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వాల్తేరు డివిజన్‌లో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు డివిజనల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్ వెల్లడించారు.

09/23/2018 - 02:13

హైదరాబాద్, సెప్టెంబర్ 22: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై పదేపదే విమరలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేత కుటుంబరావు సవాళ్లకు సమాధానం చెప్పడానకి తాము సిద్ధంగా ఉన్నామని వైకాపా సీనియర్ నేత పార్థసారధి స్పష్టం చేశారు. మంత్రులు చెప్పాల్సిన ప్రభుత్వ విధానాలను షేర్ బ్రోకర్‌గా గుర్తింపు పొందిన కుటుంబరావు మీడియాకు చెప్పడం చూస్తే సీఎంకు, మంత్రులకు మధ్య ఏదో తేడావస్తున్నట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

09/22/2018 - 23:18

విజయవాడ, సెప్టెంబర్ 22: వామపక్ష పార్టీలన్నీ ఐక్యం కావాలని మాజీ ఎంపీ, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) జాతీయ కార్యదర్శి దేవబ్రత బిశ్వాస్ ఆకాంక్షించారు. దేశ సంపదను కార్పొరేట్లు దోచుకుంటున్నారని, వీరికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక, సామాజిక సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ జరగాలంటే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీనే ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు.

09/22/2018 - 23:18

కాకినాడ, సెప్టెంబర్ 22: మాతా శిశు మరణాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా అమలుచేస్తున్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలకు తూర్పు గోదావరి జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. గర్భిణులను సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళి, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల శాతాన్ని పెంచేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం అందిస్తోంది.

09/22/2018 - 23:18

గుంటూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యం చేస్తున్నది తనకోసం కాదని, భావితరాల కోసమని సినీనటుడు శివాజీ స్పష్టం చేశారు. అయితే కొందరు తనకు సామాజికవర్గాలను అంటగడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, తన జోలికొస్తే వారి కథలను సీరియల్స్‌గా తీస్తానని పరోక్షంగా వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లను శివాజీ హెచ్చరించారు.

09/22/2018 - 23:17

విజయవాడ, సెప్టెంబర్ 22: ఏపీ రాజధాని అమరావతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఇష్టా రాజ్యంగా అప్పులు తెస్తున్నారని, తొలుత రూ. 2వేల కోట్లు విలువైన బాండ్లు విడుదల చేసి మరలా మరో రూ. 500కోట్లు విలువైన బాండ్లను విడుదల చేస్తామంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ధ్వజమెత్తారు.

09/22/2018 - 23:16

అమరావతి, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నిరకాల అనుమతులతో పాటు వౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక విధానాలతో ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ ఉత్పత్తులకు సైతం ప్రపంచ మార్కెట్‌లో స్థానం కల్పించే దిశగా పురోగమిస్తున్నట్లు చెప్పారు.

09/22/2018 - 23:15

గుంటూరు, సెప్టెంబర్ 22: రాఫెల్ డీల్‌పై ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. శనివారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం జగన్ దేశ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారన్నారు.

Pages