S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/20/2018 - 04:49

విజయవాడ, సెప్టెంబర్ 19: ప్రభుత్వ నిర్దేశానుసారం పోస్టుల భర్తీని సకాలంలో పూర్తి చేసి పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కృషి చేస్తుందని కమిషన్ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ తెలిపారు. బుధవారం విజయవాడలోని ఏపీపీఎస్‌సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.

09/20/2018 - 04:47

అమరావతి, సెప్టెంబర్ 19: చిత్తూరు జిల్లా వాయల్పాడులో మహిళపై ఇన్‌స్పెక్టర్ వేధింపులకు పాల్పడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంబంధిత ఇన్‌స్పెక్టర్‌పై తక్షణమే క్రిమినల్‌కేసు నమోదు చేసి శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

09/20/2018 - 04:46

అమరావతి, సెప్టెంబర్ 19: రాజధానిలో నెలకొల్పిన విద్యాసంస్థలు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని పరస్పర విజ్ఞాన సమాచార మార్పిడికి ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు అమరావతిలో కొలువుదీరటం గర్వకారణమని, తరగతి గదుల్లో బోధిస్తున్న విజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో పరిచయంచేసి ఫలితాలు సాధించినప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని వివరించారు.

09/20/2018 - 04:45

విజయవాడ (పటమట) సెపెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం ఆఖరిరోజు ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వం తరఫున స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమతి కోరుతూ రెండు బిల్లులు ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా అమోదింది. 2018 ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ (రెండవసవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ బిల్లును ముఖ్యమంత్రి తరఫున యనమల సభలో ప్రవేశపెట్టారు.

09/20/2018 - 04:45

అమరావతి, సెప్టెంబర్ 19: సింహాచలం పరిధిలోని పంచ గ్రామాల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులు, ఎంత భూమి రైతుల అధీనంలో ఉంది.. సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు.

09/20/2018 - 04:43

విజయవాడ, సెప్టెంబర్ 19: ఏపీకి రావాలని, ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు, చేసిన అభివృద్ధి చూసి నచ్చితే పెట్టుబడులు పెట్టాలని చైనాలోని పారిశ్రామివేత్తలకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చైనా పర్యటనలో భాగంగా టియాన్జిన్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో బుధవారం లోకేష్ మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న అభివృద్ధి వివరించారు.

09/20/2018 - 04:43

అమరావతి, సెప్టెంబర్ 19: వచ్చే ఎన్నికల్లో ప్రతి సీటు ప్రధానమే.. అన్ని నియోజకవర్గాల్గో గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాల అనంతరం బుధవారం అసెంబ్లీ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయంలో లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి సీటులో గెలుపు సవాల్‌గా తీసుకోవాలన్నారు.

09/20/2018 - 04:41

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ముగిశాయి. ఉభయ సభలునిరవధికంగా వాయిదా పడ్డాయి. శాసనసభ మొత్తం 51.07 గంటల పాటు సమావేశమైంది. 16 బిల్లులను ఆమోదించగా, ఒక బిల్లును ఉపసంహరించుకుంది. 108 మంది ఎమ్మెల్యేలు మాట్లాడగా, 344 నిబంధన కింద ఏడు అంశాలపై సభలో చర్చ జరిగింది. 74వ నిబంధన కింద ఏడు అంశాలపై చర్చ జరగ్గా, 86 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

09/20/2018 - 04:41

గుంటూరు, సెప్టెంబర్ 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించడమంటే ప్రజా సమస్యలను విస్మరించడమేనని శాసనమండలి చీఫ్ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అనేక సమస్యలపై చర్చ జరుగుతోందని, ప్రతిపక్ష నేత, విపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడం బాధాకరమన్నారు.

09/20/2018 - 04:40

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: సీపీఎస్‌పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుండా శాసన మండలిలో తప్పించుకుంటే సరిపోదని, ప్రజలకు సమాధానం చెప్పక తప్పని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అన్నారు.

Pages