S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/19/2018 - 12:44

పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని బెల్‌గాం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ తల్లి తన ఇద్దరి చిన్నారులతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సివ్వాపు శైలజగా గుర్తించారు. చిన్నారులు లిఖిత (6), యామిని (4)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

09/19/2018 - 04:49

* అసెంబ్లీ వ్యూహకమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

09/19/2018 - 04:49

కర్నూలు, సెప్టెంబర్ 18: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవినీతిలో కూరుకుపోయారని, ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించారని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే తన కళ్లలోకి చూసే ధైర్యం చేయలేకపోతున్నారని రాహుల్ మండిపడ్డారు.

09/20/2018 - 05:09

విజయవాడ, సెప్టెంబర్ 18: టెక్నాలజీతో సుపరిపాలన, పారదర్శకత సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పారదర్శకత వల్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్టీజీ- పరిపాలన, అభివృద్ధిలో సాంకేతిక విజాన సమన్వయం - పర్యవేక్షణ అన్న అంశంపై లఘు చర్చ మంగళవారం జరిగింది. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలకు మేలు జరగాలంటే అన్ని విధాలం లాభాం చేకూర్చాలంటే పరిపాలనపై శ్రద్ధ పెట్టాలన్నారు.

09/19/2018 - 04:47

విజయవాడ, సెప్టెంబర్ 18: పాఠశాల విద్యకు సంబంధించి కంటిన్యువస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ (సీసీఈ) పరీక్ష విధానంలో కొన్ని మార్పులు చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విద్యా సంవత్సరంలో రెండు సమ్మెటివ్ అసెస్‌మెంట్స్ ఉంటాయి. మొదటిది నవంబర్ 1 లేదా 2వ వారంలో, రెండవది మార్చి/ఏప్రిల్‌లో ఉంటుంది.

09/19/2018 - 04:46

అమరావతి, సెప్టెంబర్ 18: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యానికి కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు ఈ సీజన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు.

09/19/2018 - 04:44

విజయవాడ, సెప్టెంబర్ 18: రైతులు ఆరుగాలం శ్రమించి పండించే ఉత్పత్తులకు సరైన కనీస మద్దతు ధర నిర్ణయంలోనూ, ఆపై కొనుగోలులోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతుల పట్ల పూర్తి వివక్ష చూపిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.

09/19/2018 - 04:09

మదనపల్లె, సెప్టెంబర్ 18: చిత్తూరు జిల్లా అంగళ్ళు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మొదలకు రంగాల్లో పరిశోధన, పారిశ్రామికవిద్య, సాంకేతిక శిక్షణలకు సంబంధించి అత్యాధునిక అడ్వాన్స్‌డ్ రోబోటిక్ పరిశోధన కేంద్రం (ఏఆర్‌సి)ను జర్మనీ ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం రాత్రి మిట్స్ కరస్పాండెంట్ డాక్టర్ నాదేళ్ల విజయభ

09/19/2018 - 03:50

గుంటూరు, సెప్టెంబర్ 18: ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై రైతులకు, వ్యవసాయాధికారులకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

09/19/2018 - 03:48

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: సింహాచలం పంచ గ్రామాల సమస్య దాదాపూ మూడు, నాలుగు దశాబ్దాలుగా కొనిక్కిరాని భూ సమస్య. సింహాచల దేవస్థానానికి, భూ ఆక్రమణదారులు, హిందూ ధార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ఈ సమస్య ఎప్పటికైనా కొలిక్కి వస్తుందా అని పంచ గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Pages