-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 277 పాయింట్లు పెరిగి 35,935కి పెరిగింది. నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 10,853 వద్ద స్థిరపడింది.
న్యూఢిల్లీ: భారత్లో అర్థికాభివృద్ధి వేగంగా జరుగుతున్నా, అది అపసవ్య దిశలో ప్రయాణిస్తోందని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థిక శాస్తవ్రేత్త అమర్త్యసేన్ అన్నారు. 2014 నుంచి అభివృద్ధి నమోదవుతున్నా, అది ప్రతికూల దిశ నడుస్తోందన్నారు. దీని పర్యవసానం వల్ల మంచి ఫలితాలు రావన్నారు. దక్షిణాసియాలో ఆర్థికంగా బాగా దెబ్బతిన్న దేశాల్లో రెండవ దేశం భారత్ అని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ, జూలై 8: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి రుణాలు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన సంస్థలు బకాయి ఉన్న మొత్తం 2018 జూన్ 30 నాటికి అంతకు ముందు నెలతో పోలిస్తే 0.87 శాతం తగ్గుదలతో రూ. 15,354.52 కోట్లకు చేరింది. బ్యాంకుకు సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పీఎన్బీ నుంచి రూ.
న్యూఢిల్లీ, జూలై 8: దేశ స్థూలార్థిక గణాంకాలు, కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆదాయాలు, ప్రపంచ వాణిజ్య సంబంధాలు వంటి కీలకాంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. ‘మదుపరుల దృష్టి ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు, రుతపవనాలు వంటి అంశాలపై కేంద్రీకృతమయి ఉంటుంది.
విజయవాడ, జూలై 8: రాష్ట్రంలో నిర్వహిస్తున్న సదస్సులు, విదేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలు సత్ఫలితాలిస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు నిరంతరం అందుబాటులో ఉంటూ పెట్టుబడులు రాష్ట్రంలో ప్రవహించేలా చేస్తున్నారు.
న్యూఢిల్లీ, జూలై 8: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచాలని తీసుకున్న నిర్ణయం ప్రభావం దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)పై 0.1 శాతం నుంచి 0.2 శాతం వరకు ఉంటుందని, ద్రవ్యోల్బణం ఒత్తిడులను కూడా పెంచుతుందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ తన నివేదికలో పేర్కొంది. అధిక కనీస మద్దతు ధరల వల్ల ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక వ్యయం పెరుగుతుందని ఆ నివేదిక వివరించింది.
న్యూఢిల్లీ, జూలై 7: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ముకేశ్ అంబానీ మరో అయిదేళ్ల పాటు కొనసాగడానికి ఆ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. 61 ఏళ్ల అంబానీ 1977 నుంచి రిల్ బోర్డులో కొనసాగుతున్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత, తన తండ్రి ధీరూభాయ్ అంబానీ 2002 జూలైలో కన్నుమూసిన తరువాత ముకేశ్ రిల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.
ముంబయి, జూలై 7: క్రితం వారం నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో మళ్లీ మంచి లాభాలను గడించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 234.38 పాయింట్లు పుంజుకొని 35,657.86 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 58.35 పాయింట్లు పెరిగి కీలకమయిన 10,750 పాయింట్ల స్థాయికి ఎగువన 10,772.65 పాయింట్ల వద్ద స్థిరపడింది.
టామ్ మెటకాఫ్, బ్లూంబర్గ్, జూలై 7: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్ను అధిగమించిన ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకెన్బర్గ్ మూడోస్థానాన్ని ఆక్రమించాడు. అతని కంటే ముందు ఒకటి రెండు స్థానాల్లో అమెజాన్.కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ మాత్రమే ఉన్నారు.
స్టాక్హోమ్, జూలై 7: నోబెల్ అకాడెమీలో ఓ కీలక అధికారిపై అవినీతి, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ అవార్డును ప్రకటించే అవకాశాలకు దాదాపు తెరపడింది. అయితే, ప్రస్తుతం ఉన్న కమిటీ అవార్డును ప్రదానం చేయకపోతే, ఆ బాధ్యతను తాము స్వీకరిస్తామంటూ ఒక కొత్త అకాడెమీ తెరపైకి వచ్చింది.