-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
వేములవాడ / వేములవాడ టౌన్, మార్చి 6: హవాలా అంటే అరబిక్ భాషలో బదిలీ.. అక్రమంగా చేసే మనీ ట్రాన్స్ఫరే హవాలా లేదా హుండీ అని పిలుస్తుంటారు. భారీ మొత్తంలో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే డైరక్టుగా తీసుకొని వెళ్లాలి. లేదా బ్యాంక్లో వేయాలి.. కానీ హవాలా వ్యాపారానికీ ఇవేమీ అవసరం లేదు. ఒక్క్ఫోన్ కాల్ చాలు. హవాలా ఏజెంట్కి ఫోన్చేసి ఫలానా వాడికి.. ఫలానా చోట ఎంత ఇవ్వా లో చెబితే చాలు ..
న్యూఢిల్లీ, మార్చి 6: వచ్చేమూడేళ్లకాలం లో దేశంలో సేల్స్ రంగం 2.5 మిలియన్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని టీమ్లీజ్ సంస్థ విశే్లషించింది. ఇప్పటి వరకు ఉపాధి కల్పనలో వ్యవసాయరంగానిదే ప్రధా న పాత్ర. అయితే రానున్న మూడేళ్ల కాలంలో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని పేర్కొంది. సేల్స్ రంగం లో, ముఖ్యంగా సంఘటిత రిటైల్ రంగం 50 శాతం ఉపాధి అవకాశాల ను కల్పిస్తోంది.
న్యూఢిల్లీ, మార్చి 6: 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకొని 7.1% వృద్ధి నమోదు చేసే అవకాశముంది. ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడం, వినియోగ స్థాయి లు పెరగడం ఇందుకు కారణమని కోటక్ ఎకనామిక్ రీసెర్చ్ అంచనా వేసింది. గత రెండేళ్లుగా దేశం ఎదుర్కొన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి.
విశాఖపట్నం, మార్చి 6: భారత దేశంలో కాఫీకి బాగా డిమాండ్ తగ్గినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనికి కారణం బ్రెజిల్లో ఈ పంట బాగా సాగు చేయడం, అక్కడి నుంచే ఇతర దేశాలకు సరఫరా చేస్తుండడంతో దేశీయంగా సాగవుతున్న కాఫీకి బాగా డిమాండ్ తగ్గినట్లు సంబంధిత అధికారవర్గాలు చెబుతున్నాయి. బ్రెజిల్ నుంచి సరఫరా అవుతున్న కాఫీతో ఆ ప్రభావం భారతదేశ కాఫీ విక్రయాలపై తీవ్రంగా పడుతోంది.
హైదరాబాద్, మార్చి 6: క్రూడ్ పామాయిల్ దిగుమతులపై దిగుమతి సుంకం విధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయిల్ పామ్ డెవలపర్స్ ప్రోసెసర్స్ అసోసియేషన్ ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆ సంస్థ అధ్యక్షుడు సంజయ్ గోయింకా ప్రకటన విడుదల చేశారు. మార్చి 1వ తేదీన ఈ నోటిఫికేషన్ను కేంద్రం విడుదల చేసిందన్నారు. దిగుమతి సుంకాన్ని 30శాతం నుంచి 44 శాతానికి పెంచారన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 6: ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పొల్చుకుంటే తక్కువ ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు డెలాయిట్ గ్లోబల్, నోబెల్ గ్రూప్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, కిమాషి ఎలక్ట్రానిక్స్ సీఈవోలతో లోకేష్ సమావేశమయ్యారు.
ముంబయి, మార్చి 6: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి, ఐసిఐసీఐ సీఈవో చందాకొచ్చర్, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మలకు సీరియర్ ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఐఎఫ్ఓ) సమన్లు జారీ చేసిందన్న వార్త స్టాక్ మార్కెట్ను కుదిపేసింది. ఒక్కసారిగా ఈ రెండు బ్యాంకుల స్టాక్లు తీవ్రస్థాయిలో అమ్మకాల ఒత్తిళ్లకు గురయ్యాయి.
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ల నష్టాల్లోనే ముగిశాయి. సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల దిగువకు చేరాయి. ఒక దశలో సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా కోల్పోయింది. నిఫ్టీ10300 స్థాయిని, సెన్సెక్స్ 33500 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ 430 పాయింట్ల నష్టంతో 33,317 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల పతనంతో 10,249 వద్ద ముగిసింది.
విజయవాడ, మార్చి 5: ఇ-నిధి, ఇ-ఆఫీస్ ఆధార్ ఎనెబుల్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ అంశాలపై సోమవారం ఢిల్లీ నుండి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఇన్ఛార్జి రచన శ్రీ వాస్తవ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో హైదరాబాద్ ఎన్ఐసీ కేంద్రం నుండి ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ పాల్గొనగా అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 5: ఈనెల నుంచి 45 కిలోల యూరియా బ్యాగ్ 242 రూపాయలకే లభిస్తుంది ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక నుంచి 50 కిలోల బ్యాగ్కు బదులుగా 45 కిలోల బ్యాగ్లో దొరుకుతుంది. పన్నులతో కలుపుకొని 242 రూపాయలకు మార్కెట్ ధరకే రైతులకు అందుబాటులో ఉంటుందని వారన్నారు. టన్నుకు 5,360 రూపాల ధరను నిర్ణయించిన ప్రభుత్వం బ్యాగు యూరియా ధర 242 సరఫరా చేయనుంది.