S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/15/2019 - 02:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఇన్‌సైడర్ వాణిజ్య మార్గదర్శకాలను విస్మరించిన ఓ కేసులో ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (జీఐసీ) రూ. 1.23 కోట్ల మొత్తం మార్కెట్ నియంత్రణ విభాగం సెబీకి శుక్రవారం చెల్లించింది. తద్వారా ఈ కేసును జీఐసీ సెటిల్మెంట్ చేసుకుంది. యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న ఈ కంపెనీ వాటాలపై సెబీ జరిపిన విచారణలో జీఐసీ లొసుగులు వెలుగు చూశాయి.

12/15/2019 - 02:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఉల్లిగడ్డ కొరత యావత్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ పరిస్థితిపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని విమర్శలు, వ్యాఖ్యలు, జోకులు పుట్టుకొస్తునే ఉన్నా యి. అయితే, కొరత ఉన్నప్పటికీ, ఇటీవల కాలం లో ఉల్లి దిగమతి గణనీయంగా తగ్గడాన్ని శుభవార్తగానే చెప్పుకోవాలి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.8.42 కోట్ల విలువైన ఉల్లి దిగుమతి అయింది.

12/13/2019 - 05:19

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ అత్యధికంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పరిస్థితులే ఇందుకు కారణమని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రధానంగా వడ్డీరేట్లలో వచ్చే ఏడాది వరకు ఎలాంటి మార్పులూ ఉండబోవన్న సంకేతాలు అమెరికన్ ఫెడరల్ రిజర్వు నుంచి వెలువడడం ముదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపిందని అంటున్నారు.

12/13/2019 - 05:16

ముంబయి, డిసెంబర్ 12: అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకు గోల్డ్‌మన్‌సచ్ తన ఇతర అనుబంధ పెట్టుబడిదారులతో కలిసి 30 మిలియన్ డాలర్ల నిధులను ఆన్‌లైన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సంస్థ ‘పర్పుల్ డాట్ కాం’లో మదుపుచేసింది. ఆ ఆన్‌లైన్ సంస్థ నిర్వహించిన సిరీస్ సీ ఫండింగ్ రౌండ్ కార్యక్రమంలో భాగంగా ఈ పెట్టుబడుల సమీకరణ జరిగింది. ప్రధానంగా అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు ఇందులో భాగస్వాములయ్యారు.

12/13/2019 - 05:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకారుూల చెల్లింపునకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ శ్యామ్‌రావ్ దోత్రే గురువారం రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థ పరిస్థితి మెరుగైన వెంటనే కాంట్రాక్టు కార్మికులకు సైతం రావలసిన బకారుూలు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.

12/13/2019 - 05:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఉజ్టివాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ మార్కెట్లో గురువారం ఆరంభ ఇస్యూతోనే అదరగొట్టింది. రూ. 37 ధరతో విడుదలైన ఈ ఇస్యూ బీఎస్‌ఈలో ఇంట్రాడేలో ఏకంగా 57 శాతం బలపడింది. ఒక దశలో రూ. 53.10కి దిగివచ్చినప్పటికీ చివరికి రూ. 55.90గా స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ ఇస్యూ రూ. 58.75తో మొదలై ఇంట్రాడేలో రూ. 62.80కి చేరింది. చివరిగా 5.87 శాతం తగ్గుదలతో రూ.

12/12/2019 - 05:14

హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి కొరియా దేశానికి చెందిన యంగ్వాన్ టెక్స్‌టైల్స్ సంస్థ ముందుకు వచ్చింది. వరంగల్‌లో దాదాపు రూ. 900 కోట్లు పెట్టుబడితో టెక్స్‌టైల్స్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కొరియా టెక్స్‌టైల్స్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

12/11/2019 - 23:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: డాలర్‌తో పోలిస్తే గత వారం ప్రారంభం నుంచి రూపాయి మారకపు వి లువ తగ్గుతూ వస్తోంది. నాలుగో తేదీన రూ.71.53 గా ఉన్న డాలర్ విలువ పెరుగుతూనే వచ్చింది. బుధవారం రూ.71.92కు చేరింది. మారకపు విలువ తగ్గుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభపడాలి. అయితే, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

12/11/2019 - 23:35

ముంబయి, డిసెంబర్ 11: అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణిని ప్రదర్శించడంతో భారత స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 172.69 పాయింట్లు మెరుగుపడి, 40,412.57 పా యింట్లకు చేరింది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎస్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 53.35 పాయింట్లుగా లాభపడి 11,910.15 పాయింట్ల వద్ద ముగిసింది.

12/11/2019 - 23:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద బొగ్గుగనుల సంస్థ ‘కోల్ ఇండియా’కు అనుబంధంగా ఉన్న ఏడు సంస్థల్లో ఆరు సంస్థలు కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలను తుంగలో తొక్కాయని కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది.

Pages