-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
వాషింగ్టన్, మార్చి 13: సంచలనాలకు మారుపేరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్కు ఉద్వాసన చెప్పేసి ఆయన స్థానంలో సీఐఏ డైరెక్టర్ మైక్ పొంపెయోను నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘టిల్లర్సన్ స్థానంలో మైక్ పొంపెయోను నియమించాం. ఇక నుంచి అమెరికా కొత్త విదేశాంగ మంత్రి పొంపెయో.
ఇస్లామాబాద్, మార్చి 12: పాకిస్తాన్ చరిత్రలో తొలిసారిగా ఓ హిందూ దళిత మహిళ సెనేటర్గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. ఎగువ సభలో సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన 51మంది సెనేటర్లలో ఈమె కూడా ఒకరు. సింధ్ ప్రావిన్స్కు చెందిన నాగర్పార్కర్ ప్రాంతంలోని మారుమూల గ్రామం థార్కు చెందిన కృష్ణకుమారి కోల్హి అనే హిందూ దళిత మహిళ ఈ నెల 3న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది.
మారిషస్లో పర్యటిస్తున్న రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ సోమవారం సవనె్నలోని
గంగా తలావ్ వద్దగల శివ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యం
మంచు కురిసిన వేళ.. ఎంత మధురం..! అలాంటి మంచు మధ్యే ఉంటే.. తమ కళ్ల ముందే ఓ మంచు వలయం క్రమంగా కూలుతున్న దృశ్యం చోటుచేసుకుంటే అది అనిర్వచనీయమైన అనుభూతి. అలాంటి దృశ్యానే్న అర్జెంటీనా టూరిస్టులు కళ్లారా తలికించారు. పెరిటో మోరెనో హిమానీనద ప్రాంతంలో ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. హిమానీనదానికి.. అర్జెంటీనో సరస్సుకు మధ్య మంచు వలయం కొనే్నళ్లకోసారి ఏర్పడుతుంది.
కాఠ్మండూ, మార్చి 12: కాఠ్మండూ విమానాశ్రయంలో సోమవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 57మంది దుర్మరణం పాలయ్యారు. యుఎస్- బంగ్లాకు చెందిన ఈ విమానం ఢాకా నుంచి కాఠ్మండూకు వస్తోంది. విమానం త్రిభువన్ విమానాశ్రయంలో దిగే సమయంలో రన్వే పైనుంచి జారిపోయి పక్కనే ఉన్న పుట్బాల్ మైదానంలో కుప్పకూలిపోయిందని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి ప్రేమ్నాథ్ ఠాకూర్ తెలిపారు.
మియామి, మార్చి 10: ఆయుధాల ధరించే విషయంలో కొన్ని నియంత్రణలు విధించే బిల్లుపై ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ సంతకం చేయడంతో, అమెరికాలో తుపాకి సంస్కృతికి కొంతమేర కట్టడి చేయడానికి అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. దీనికి పార్క్లాండ్ కాల్పుల్లో మృతిచెందిన వారి బంధువులనుంచి పూర్తి మద్దతు లభించింది. అమెరికాలో తుపాకీ సంస్కృతిని నియంత్రించడానికి ఏ ప్రభుత్వమైనా వెనకాడుతుతుంది.
బీజింగ్: చైనాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. తప్పుడు జాతకం చెప్పిన వ్యక్తి స్టాల్పై 70 ఏళ్ల వృద్ధురాలు దాడి చేసి దుకాణం ధ్వంసం చేసింది. చైనా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చైనా సిఛౌన్ రాష్ట్రంలోని మియాన్యాంగ్లో (70) వృద్ధురాలు నివసిస్తోంది. వాంగ్ అనే ఆమెకు ఓ జ్యోతిష్యుడు ‘నీవుఎక్కువ కాలం బతకవని చెప్పేశాడు. ఏడాది చివరినాటికే చనిపోతామని 2018 సంవత్సరం చూడవు’ అని జాతకం చెప్పాడు.
వాషింగ్టన్, మార్చి 9: ప్రముఖ పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి పెద్ద మొత్తంలో రివార్డులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తెహ్రిక్ ఇ పాకిస్తాన్ అధినేత వౌలానా ఫజలుల్లాపై 5 మిలియన్ అమెరికన్ డాలర్లు, జమాత్ ఉల్ ఆహ్రర్కు చెందిన అబ్దుల్ వలి, లష్కర్ ఎ ఇస్లామ్కు చెందిన మంగల్ టాగ్ పై చెరో 3 మిలియన్ డాలర్ల చొప్పున రివార్డులు ప్రకటించారు.
వాషింగ్టన్, మార్చి 9: అమెరికా విధిస్తున్న సుంకాలను మించిన స్థాయిలో పన్నులను విధిస్తే దానికి తగ్గట్టుగానే తాముకూడా భారత్, చైనాలపై పన్ను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో సుంకాలకు సంబంధించి ట్రంప్ తెగింపు ధోరణి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన వెలువడం మరింత కలవరానికి కారణమైంది.
బీజింగ్, మార్చి 8: భారత్-చైనా దేశాలు తమ విభేదాలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాల విస్తృతికి కృషి చేయాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ గురువారం కోరారు. పరస్పర రాజకీయ విశ్వాసంతో అడుగులు ముందుకేస్తే హిమాలయాలు కూడా ఇద్దరి మైత్రిని ఆపలేవన్నారు. డ్రాగన్-ఏనుగు పరస్పరం నృత్యం చేయాలి తప్ప కొట్లాడకూడదన్నారు.