S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

07/04/2019 - 18:39

ఇంద్రియాలు బహు శక్తివంతమైనవి కదా. విధి ప్రతికూలమైనపుడు మరింతగా ఇంద్రియాల వాటి బలాన్ని మనిషి పై చూపెడుతాయికూడా. ఎంత సంస్కారియైనా కన్ను, కాలో ఏదో ఒకటి జారుతుంది. అంతా విధిమాయ అనుకొంటూ ఎప్పటికప్పుడు మనస్సును కట్టడి చేసుకొంటూ సుఖాసనంలో కూర్చుంటున్నాడు విశ్వామిత్రుడు.

07/03/2019 - 19:27

అప్పటిదాకా అనుభవించిన రాజ్యసుఖభోగాలను తృణప్రాయంగా వదిలివేశాడు.చీనీ చీనాంబరాలు కట్టిన మేనికి నూలు వస్త్రం కట్టాడు. తళతళామెరిసే పోతూ శత్రువుల గుండెల్లో నెత్తురిడికించే కరవాలాన్ని దూరంగా విసిరేసి కమండలం పట్టుకొన్నాడు. తాను ఎలాగైనా బ్రహ్మర్షి అయిన తరువాత వేరు ఆలోచన చేయాలి అప్పటిదాకా బ్రహ్మర్షి కాగలిగే తపస్సే నా ఆలోచన అంటూ ఆలోచనాసంద్రాన్ని కట్టడి చేసేశాడు.
తపోభూమికి తరలి వెళ్లిపోయాడు.

07/01/2019 - 19:45

చల్లని మలయమారుతంగా గాలి వీచింది. ‘ఆహా! ఎంత హాయిని గొలిపే చల్లదనాన్ని, సువాసనను మోసుకొస్తోందీ గాలి. మా తండ్రి ఎర్రని ఎండలో తిరుగుతున్నారో లేక వానలో తడుస్తున్నారో ఎలా ఉన్నారో ఏమో, వేళకు తింటున్నారో లేదో అని తండ్రిని తలుచుకుని శంకుతల నిట్టూర్చింది.
ఆ నిట్టూర్పులోని వేడి గాలిని గబగబా లాగేసుకొని చెట్లు శకుంతలకు ఉపశమనం కలిగించే చల్లగాలిని పంపుతున్నాయి.

06/30/2019 - 22:23

పురు వంశంలోని రైభ్యుడనువానికి దుష్యంతుడు అను కుమారుడు కలిగాడు. దుష్యంతుడు చిన్నప్పటి నుంచి మంచి పరాక్రమశాలి. సుందరుడు. వేటాడడంలో నేర్పరి. రాజ్యాధికారం పొందినా కూడా తన రాజ్య రక్షణకే కాక వేట నిమిత్తము కూడా తన ఆయుధసంపత్తిని ఉపయోగించేవాడు. వేటాడటమేకాక క్రూర జంతువులను మచ్చిక చేయటంలోకూడా అందెవేసిన చేయి కలవాడు. కనుక సమయం చిక్కడం కాదు తానే సమయాన్ని కలిగించుకుని మరీ వేటాడడానికి పరుగులెత్తేవాడు.

06/27/2019 - 22:07

ప్రద్యుమ్నునకు పూర్వజన్మ విషయాలతో పాటు ఈ జన్మలో జరిగిపోయిన విషయాలు కూడా తెలిశాయి.
అపుడు మాయావతి రూపంలో ఉన్న రతీదేవి చెప్పిన విషయాలు నిజమని నమ్మాడు. మరి నేనిప్పుడు ఏం చేయను? ఈ శంబరాసురుని చంపివేస్తాను అన్నాడు. అపుడు

06/26/2019 - 22:06

ఈ చేపను మహారాజు గారికి ఇస్తే పెద్ద బహుమానం ఇస్తాడు. దానితో మనకు లాభం ఉంటుంది అనుకొన్నారు. అంతే జాలర్లు అందరూ కలసి ఆ చేపను పట్టుకొని శంబరాసురుడి దగ్గరకు వెళ్లి ఆయనకు బహుమతిగా ఇచ్చారు.
ఆయన వారికి వారు కోరుకున్నట్టు బహుమానం ఇచ్చి పంపించి వేసారు. ఆతరువాత ఆ చేపను వంటశాలను పంపించాడు.
***

06/25/2019 - 22:08

తాను వంటలు బాగా చేస్తానని తనకు వంట పనిని అప్పగించమని చెప్పింది. శంబరాసురుడు మాయావతి పేరుతో ఉన్న రతీదేవికి తన వంటశాలలో ఉపాధి కలిగించాడు. కాలం నెమ్మదిగా సాగుతోంది.
***
అంగరంగ వైభోగంగా కృష్ణుడు నగరమంతా పందిళ్లు వేయించి రంగురంగు పుష్పమాలికతో నగరాన్ని అలంకరించి తన కుమారుని జనన వేడుకలను జరిపిస్తున్నాడు.

06/25/2019 - 21:49

దేవతలంతా పార్వతీ కళ్యాణం జరగాలని అనుకొన్నారు. కానీ పార్వతీ దేవి హిమవంతుని పుత్రికగా పుట్టి పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తూ ఉంది. మరో ప్రక్క సతీదేవిని దూరం చేసుకొని పరమశివుడు అత్యుగ్రమైన తపోభూమిలో సమాధిలో ఉండిపోయాడు.వీరిద్దరికీ వివాహం చేయాలని దేవతలు అనుకొన్నారు.

06/23/2019 - 22:10

నీవు అలా పరుగెత్తుతుంటే నాకు నీ వెనుకనే వచ్చి నిన్ను ఒంటి చేత్తో పట్టుకొని ‘ఓరీ అర్భకా! ఇంతకుముందు వచ్చిన వారి కాలం బాగలేక వారు వెనుకడుగు వేసి ఉంటారు. లేదా వాళ్లు కాలం తీరి యముని దగ్గరకు వెళ్లి ఉంటారు. నేను అట్లా కాదురా బుడతా! ’అని చెప్పాలని పిస్తోంది. అనుకొన్నాడు కాల యవనుడు
కాలయవనుని మాటలు విని కృష్ణుడు...

06/20/2019 - 19:15

అందులోకి మనమందరం వెళ్లుదాం అని చెప్పాడు. వారంతా ఎంతో సంతోషించారు. కృష్ణుడు చెప్పినట్లు యాదవులంతా మధురానగర నివాసులంతా ద్వారకకు ప్రయాణం కట్టారు. అపుడే కృష్ణుడు తన యోగ మాయచేత మధురానగరంలోని ప్రజలను, పశుపక్ష్యాదులను ఇలా మొత్తం మధుర నంతా సాగరమధ్యలోని నగరానికి చేర్చాడు.

Pages