S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/16/2018 - 21:14

చుట్టూ మంచిగంధ, కస్తూరి కలిసిన నీళ్ళు చల్లిన జూదమాడే స్థలంలో పూలచేత పూజింపబడదిన పాచికలు అమర్చుకొని కూర్చున్న శకుని, చిత్రసేనుణ్ణి, వికర్ణుణ్ణి చూసిన ధర్మరాజు
‘‘వీరిలో ఎవడు నాతో జూదమాడుతాడు’’ అని అనగా దుర్యోధనుడు
రాజా! నేను రత్నాలను, ధనాన్ని ఇచ్చేవాడిని. నా కోసం నా మామ ఈ శకుని జూదమాడుతాడు’’ అని ధర్మరాజుతో అనగా

03/15/2018 - 21:17

అందుకు ధర్మరాజు
‘‘యాజ్ఞసేని! హస్తిననుండి వచ్చిన ఆహ్వానాన్ని నేను తిరస్కరించలేను. ధృతరాష్ట్ర మహారాజాజ్ఞ తిరస్కరించి అవిధేయుడను కాలేను. క్రొత్తగా నిర్మింపబడిన సభాభవనాన్ని తిలకించటానికై ఆహ్వానం అందింది. కాదని ఎలా అనగలను. అందువల్ల కలుగబోయే అనర్థమేమి?

03/14/2018 - 21:03

ఒకనాడు ధృతరాష్ట్రుడు ఒంటరిగా శకుని, దుర్యోధనుల అభిప్రాయాలను విదురుడికి చెప్పాడు అది విన్న విదురుడు ఆశ్చర్యపడి కలియుగ ప్రవేశం దగ్గరపడటం, జూదం సర్వనాశజనకం కావటం తెలిసికొని ధృతరాష్ట్రుడితో-

03/13/2018 - 20:40

‘‘తండ్రీ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని ఐశ్వర్యంకంటే ఎంత ఎక్కువ అంతకంతకూ పెరిగిన వాళ్ళ స్వచ్ఛమైన పరాక్రమకాంతులు అన్ని దిక్కులా నిండింది.
ధర్మరాజుచేసిన రాజసూయయాగంలో లక్షమంది బ్రాహ్మణులు భుజించడం పూర్తికాగానే అక్కడ ఒక ‘శంఖం’ మ్రోగేటట్లు ఏర్పాటుచేశారు. శంఖం ఎప్పుడూ మ్రోగుతూనే ఉన్నది. ఆ నిరంతర శంఖధ్వని విన్న నాకు శరీరం గగుర్పొడిచింది. ఆ సంపదను చూసి నేను శాంతిని పొందలేకపోతున్నాను.

03/12/2018 - 22:35

‘‘సౌబలా! పూర్వం నేను యుధిష్ఠిరుని నాశనం కొరకు ప్రయత్నించాను. అదంతా దాటుకొని అతడు నీటిలో తామరలా వృద్ధి చెందాడు. కనుకనే దైవం గొప్పదనీ, పౌరుషం నిరర్ధకమనీ అనుకుంటున్నాను. ధార్తరాష్ట్రులు హాని పొందుచున్నారు. పాండవులు నిత్యమూ వృద్ధి పొందుచున్నారు. ఆ సంపదనూ, అటువంటి సభనూ, రక్షకుల యొక్క ఆ పరిహాసాన్ని చూసి అగ్ని చేత దహింపబడుచున్నట్లుగా పరితపిస్తున్నాను.

03/11/2018 - 21:10

ధర్మరాజు తన భవనంలో ఏకాంతంగా కూర్చొని వ్యాసమహర్షి చెప్పినదాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు.
ధర్మరాజు చేసిన ప్రతిజను గూర్చి తెలిసిన యాజ్ఞసేని భర్త కూర్చున్నచోటికి వచ్చింది.
‘‘ప్రభూ!’’ అని పిలిచిన పిలుపుతో ధర్మరాజు ఏకాంతత భగ్నమయింది. యాజ్ఞసేనిని దగ్గరగా రమ్మని సైగజేశాడు. ద్రౌపది సమీపానికి వచ్చి నిలబడింది.
‘‘ద్రుపదరాజ పుత్రీ రాజసూయయాగం నిర్విఘ్నంగా పూర్తయిందిగదా?’’ అని అన్నాడు.

03/09/2018 - 21:07

ధర్మరాజు యొక్క ఆజ్ఞతో పరిచారికలు దుర్యోధనునికి పొడి వస్త్రాలను ఇచ్చారు.
అసహనశీలుడైన దుర్యోధనుడు వారి పరిహాసాన్ని సహించలేకపోయాడు. సిగ్గుతో వారివైపు ముఖాన్ని త్రిప్పకుండా నడుస్తాడు.
అయినా మరలా మణిమయ ప్రదేశాన్ని చూచి నీటిమడుగుగా భ్రమించి కట్టుకున్న బట్టలను పైకెత్తి పట్టుకొని ఈదేవానిలా నడువసాగాడు.

03/08/2018 - 21:02

రాజసూయయాగం పరిసమాప్తమయిన తరువాత వ్యాసమహర్షి తన శిష్యులతో కలిసి ధర్మరాజు వద్దకు వచ్చాడు. పాండవులందరూ ఎదురేగి పాద్యం, ఆసనం సమర్పించి తాతాగారిని పూజించారు. మహర్షిని సువర్ణ సింహాసనంమీద ఆసీనునిగావించారు. అంత మహర్షి సోదరులతో కూడి కూర్చున్న యుధిష్ఠిరునితో

03/07/2018 - 21:01

సర్వధర్మాలు తెలిసిన ‘విదురుని’కి ధనవ్యయమనే కార్యాన్ని అప్పగించాడు.
శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారం అందరినీ సంతోషపరచే నెపంతో బ్రాహ్మణుల పాద ప్రక్షాళనం చేయసాగాడు. దీనివల్ల ఆయనకు ఉత్తమఫలం లభించింది.
అలా ధర్మజుని యజ్ఞానికి వచ్చిన రాజులలో ఎవరూ వెయ్యి సువర్ణాలకన్నా తక్కువ కానుకలను తీసుకురాలేదు.

03/06/2018 - 23:23

రాజాజ్ఞ ప్రకారం రాజులందరినీ ఆహ్వానించటానికి సహదేవుడు వెంటనే దూతలను పంపాడు.
దేశ దేశాలనుండి బ్రాహ్మణులందరూ వచ్చారు. వారందరూ కలసి సరైన సమయంలో ధర్మరాజుకు దీక్షను ఇచ్చారు. వేలకొలది బ్రహ్మణులు వెంటరాగా నలుగురు సోదరులతో, జ్ఞాతులతో, మంత్రులతో, నానా దేశాలనుండి వచ్చిన రాజులతో నరశ్రేష్ఠుడైన ధర్మరాజు యజ్ఞశాలలో ప్రవేశించాడు.

Pages