S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/17/2019 - 04:30

రాయదుర్గం, జూలై 16: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వివాహితను మభ్యపెట్టి మాయచేసి ఏడాది పాటు శారీరకంగా అనుభవించిన ఓ ప్రబుద్ధుడు వీడియోలు తీసి బెదిరించి ఆనక తన ముగ్గురు స్నేహితులకు ఆమెను ఎరగావేశాడు. ఏడాదిపాటు ఈ కీచకుల చేతిలో చిత్రవధకు గురైన బాధితురాలు కుటుంబసభ్యుల సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సీఐ రజాక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/17/2019 - 04:17

విజయవాడ (క్రైం), జూలై 16: కృష్ణా కరకట్ట అక్రమ కట్టడాల వ్యవహారంలో చందన భవనానికి ఇచ్చిన స్టే ఎత్తివేయాలంటూ సీఆర్‌డీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. కృష్ణా కరకట్ట ఆక్రమణలపై దృష్టి సారించిన ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొద్దిరోజుల క్రితం ఇక్కడి ప్రజావేదికను తొలిగించింది.

07/17/2019 - 03:52

ఖైరతాబాద్, జూలై 16: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారి రాంప్రసాద్ హత్యకేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 6న పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో రాంప్రసాద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వ్యాపార లావాదేవీల్లో ఏర్పడ్డ వివాదంతో కే.సత్యనారాయణకు మృతుడు రాంప్రసాద్ మధ్య శత్రుత్వం ఏర్పడింది.

07/17/2019 - 03:50

మైలవరం, జూలై 16: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మైలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్సుమల్లి శివారు ములకలపెంట గ్రామానికి చెందిన రామినేని కృష్ణ (50) అనే వికలాంగుడు తన మూడు చక్రాల వాహనంపై తన తండ్రి శ్రీమన్నారాయణ (75)ను ఎక్కించుకుని మైలవరంలోని బ్యాంకుకు బయలుదేరాడు. చండ్రగూడెం బైపాస్ రోడ్డు వద్ద రాంగు రూటులో వచ్చిన టాటా ఏస్ వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది.

07/17/2019 - 03:41

కులకచర్ల, జూలై 16: మండలంలోని గణాపురం గ్రామానికి చెందిన సునీల్‌కు మంగళవారం ఉదయం పేటీఎం నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించిన సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో బాధితుని ఏటీఎం కార్డు సంఖ్య సంపాదించి అతని ఖాతా ద్వారా రూ.25 వేలు తస్కరించారు. విషయం తెలియని సునీల్ నిజంగానే బ్యాంకువాళ్లే ఫోన్‌చేసి ఉండవచ్చునని వివరాలన్నీ తెలిపాడు. దీంతో వెంటనే ఖాతా నుంచి రూ. 25 వేలు డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది.

07/17/2019 - 03:40

ఘట్‌కేసర్, జూలై 16: ద్విచక్రవాహనాన్ని కారు డీకొట్టిన సంఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..

07/17/2019 - 03:54

శంకర్‌పల్లి, జూలై 16: గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడిన సంఘటన వికారబాద్ పోలీసుసేష్టన్ పరిధిలో చోటు చేసుకుంది . రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి శంకర్‌పల్లి వద్ద వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని అన్నారు.

07/17/2019 - 03:39

హైదరాబాద్, జూలై 16: హైదరాబాద్‌లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను వెస్ట్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. నిందితులు నుంచి 246 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

07/17/2019 - 03:39

శేరిలింగంపల్లి, జూలై 16: బీహెచ్‌ఈఎల్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీకలదాకా తాగి మిత్రులే హత్య చేయడం గమనార్హం. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చందానగర్ ఇన్‌స్పెపెక్టర్ బీ.రవీందర్ కథనం ప్రకారం హత్యోదంతం వివరాలిలా ఉన్నాయి.

07/17/2019 - 03:38

వనస్థలిపురం, రాజేంద్రనగర్, జూలై 16: ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన చిన్న పిల్లలను పనిలో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయిస్తున్న ఫ్యాక్టరీపై రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆపరేషన్ స్మైల్ పేరుతో రాచకొండ పోలీసులు, రెవిన్యూ శాఖ అధికారులు ఉమ్మడిగా నిర్వహించిన దాడులలో సుమారు 54 మంది చిన్న పిల్లలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Pages