-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, జూలై 13: బంజారాహిల్స్ పోలీస్టేషన్లో యాంకర్ శే్వతారెడ్డి ఫిర్యాదు చేశారు. బిగ్బాస్-3లో తనను సెలెక్ట్ చేసినప్పటికీ ఇప్పటీ వరకు నిర్వహకులు అగ్రిమెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. బిగ్బాస్లో చేయాలంటే బాస్ని ఇంప్రెస్ చేయాలని, ఆర్గనైజర్స్ అసభ్యంగా మాట్లాడారని విమర్శించారు.
హైదరాబాద్: వాతావరణంలో మార్పు, వర్షాకాలం మొదలు కావడంతో ప్రబలే వ్యాధుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ రూపొందించిందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టు ముందుంచాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ , జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ: శాసనసభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాలను కర్నాటక స్పీకర్ ఆమోదించడం లేదని మరో ఐదుగురు సుప్రీం కోర్టుకు వెళ్ళారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా స్పీకర్ను ఆదేశించాలని ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె. సుధీర్, ఎన్. నాగరాజ్, మునిరత్న, రోషన్ బేగ్ శనివారం సుప్రీంను ఆశ్రయించారు.
చెన్నై, జూలై 13: భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న ఓ ముఠాను జాతీయ దర్యాప్తు ఏజెన్సీ అధికారులు శనివారం మట్టుబెట్టారు. తమ లక్ష్యాల సాధన కోసం నిధులు సేకరిస్తున్న ఈ సంస్థ సభ్యులు ఉగ్రవాద దాడులకు పన్నాగం పన్నుతున్నట్లుగా వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నాగపట్నం, చెన్నై ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యుల ఇళ్ళపై అధికారులు దాడులు జరిపారు.
నర్సీపట్నం, జూలై 12: విశాఖ ఏజెన్సీ నుండి ఉత్తరప్రదేశ్కు భారీ ఎత్తున తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని నీలంపేట వద్ద శుక్రవారం ఉదయం రెండు వ్యాన్లలో తరలిస్తున్న సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే 1386 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
అహ్మదాబాద్: పరువు నష్టం దావా కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి శుక్రవారం అహ్మదాబాద్లోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీపై అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు క్రిమినల్ పరువు నష్టం దావా కేసు దాఖలు చేసింది. ఈ బ్యాంకు చైర్మన్గా అజయ్ పాటిల్ కాగా డైరెక్టర్గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్టర్గా ఉన్నారు.
హైదరాబాద్, జూలై 12: అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణ కొనసాగింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. ఎర్రమంజిల్లోని భవనం 150 ఏళ్ల క్రితం కట్టిందని పిటిషనర్లు వాదించారు.
హైదరాబాద్, జూలై 12: మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో బంజారాహిల్స్ పోలీస్టేషన్లో రేవతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శుక్రవారం మణికొండలోని ఆమె నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్టేషన్కు తీసుకువచ్చారు. కేసు విచారణలో భాగంగా పోలీస్టేషన్కు వచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఇంటికి వెళ్లి అరెస్టు చేసిన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పులివెందుల, జూలై 12: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు అనుమతివ్వాలని సిట్ అధికారులు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ను విచారించిన కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది.
షాద్నగర్, జూలై 12: కేశంపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆరు మంది బృందం సభ్యులతో కేశంపేట తహశీల్దార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు చేరుకొని భూ రికార్డులను తనిఖీలు చేస్తున్నారు. మూడేళ్ల కాలంలో తహశీల్దార్ లావణ్య చేసిన అవినీతిపై ఏసీబీ అధికారుల బృందం సభ్యులు లోతుగా విచారణ మొదలు పెట్టారు.