S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/13/2020 - 02:01

మచిలీపట్నం, మార్చి 12: మా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలంటూ మచిలీపట్నం నగర పాలక సంస్థలో విలీన ప్రతిపాదిత గ్రామ పంచాయతీలకు చెందిన కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. బందరు మండలంలోని పోతేపల్లి, మేకావానిపాలెం, అరిసేపల్లి, సుల్తానగరం, చినకరగ్రహారం, పెదకరగ్రహారం, గరాలదిబ్బ, ఎస్‌ఎన్ గొల్లపాలెం, రుధ్రవరం గ్రామ పంచాయతీలను మచిలీపట్నం నగర పాలక సంస్థలో విలీనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

03/13/2020 - 01:53

మెహిదీపట్నం, మార్చి 2: షోరూంలోని ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. లంగర్‌హౌస్ ఎస్‌ఐ బాలస్వామి కథనం ప్రకారం.. లంగర్‌హౌస్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే 85 పిల్లర్ నెంబర్ వద్ద ద్విచక్ర వాహనాల షోరూం ఉంది. బుధవారం రాత్రి షోరూమ్‌కి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు.

03/13/2020 - 06:10

న్యూఢిల్లీ: సీఏఏ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో తాజాగా మరోపిటిషన్ దాఖలైంది. గురువారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఢిల్లీ పోలీసులు, ఆప్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

03/12/2020 - 23:47

న్యూఢిల్లీ, మార్చి 12: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఉన్నావో కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టులో గురువారం అసాధారణమైన వాదనలు చోటు చేసుకున్నాయి. ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి అనుమానాస్పద మృతి కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ముద్దాయిగా ఉన్నారు. 2018 ఏప్రిల్ 9న బాధితురాలి తండ్రి పోలీసులు కస్టడీలో చనిపోయాడు.

03/12/2020 - 06:23

వరంగల్, మార్చి 11: ఖమ్మం లేబర్ అసిస్టెంట్ అధికారి మోకు ఆనంద్‌రెడ్డి (45) కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. అందుకు బాధ్యులైన ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రదీప్‌రెడ్డి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. డబ్బు విషయంలో వచ్చిన మనస్పర్థల వల్లే ఆనంద్ రెడ్డిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.

03/12/2020 - 05:24

మచిలీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కాపుసారా విక్రయాలపై పోలీసులు పంజా విసురుతున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖాధికారులతో పోలీసులు ‘ఆపరేషన్ స్పిరిట్’ పేరుతో నాటుసారా తయారీ స్థావరాలపై విస్తృత దాడులు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్‌లు వేసింది.

03/12/2020 - 05:17

మచిలీపట్నం, మార్చి 11: జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇటీవల జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి లెక్క తేలింది. బ్యాంక్ అప్రైజర్‌గా గత రెండు దశాబ్దాలుగా నమ్మకంగా పని చేస్తున్న సత్య వరప్రసాదరావు చేతివాటాన్ని ప్రదర్శించి ఏకంగా రూ.6.71కోట్లకు బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టాడు.

03/12/2020 - 05:12

విజయవాడ (క్రైం), మార్చి 11: ఓఎల్‌క్స్ ద్వారా మోసపోయిన బాధితునికి సైబర్ క్రైం పోలీసులు ఊరట కలిగించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన భీమవరపు ఫణికుమార్ 2017లో ఓఎల్‌ఎక్స్ ద్వారా ఓ కారును చూశారు. సదరు యాప్ ఇవ్వబడిన ఫోన్ నెంబర్‌తో ఫణికుమార్ సంప్రదింపులు జరిపారు. అతనితో మాట్లాడిన అవతలి వ్యక్తి తనను పరిచయం చేసుకుంటూ ఎయిర్ కార్గో అధికారినని నమ్మబలికాడు.

03/12/2020 - 05:07

ఖైరతాబాద్, మార్చి 11: ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్(21) లక్డీకపూల్‌లోని విఘ్నేష్ విరాట్ హోటల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. హోటల్‌లో పనిచేసే సిబ్బంది కోసం యాజమాన్యం ఖైరతాబాద్‌లో ఓ గదిని అద్దె తీసుకుంది.

03/12/2020 - 05:00

శేరిలింగంపల్లి, మార్చి 11: పెళ్లి పేరుతో ఇద్దరు మహిళలను నైజీరియన్‌ల ముఠా మోసగించింది. బాధిత మహిళల నుంచి రూ.12.45 లక్షలు దోచుకున్నారు. డైవర్సీ మాట్రిమోనీలో విదేశీ డాక్టర్ పేరుతో బడా మోసానికి పాల్పడిన నలుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడు. సైబర్ నేరస్థుల గ్యాంగ్ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ.3.05వేల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

Pages