-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరిన సుప్రీం కోర్టు బెంచ్
టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు బదిలీ కోర్టుల పరిధిలోకి స్పీకర్ రారు: ఏజీ వాదన
కాలయాపన భరించాల్సిందేనా?: పిటిషనర్ వాదన స్పీకర్లే పార్టీ ఫిరాయస్తున్నారు: బెంచ్ సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ, నవంబర్ 7: పఠాన్కోట్పై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి జరిపినప్పుడు దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రసారం చేసిందంటూ ఎన్డిటివి హిందీ చానల్ను ఈ నెల 9న ఒక రోజు పాటు నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలను కేంద్ర సమాచార శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
రేణిగుంట, నవంబర్ 7: తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి సోమవారం పెనుప్రమాదం తప్పిన సంఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటుచేసుకుంది. మరికొద్ది సేపట్లో రన్వేపైకి వెళ్లాల్సిన విమానం వెనుకచక్రంలోపూర్తిగా గాలితగ్గిపోవడంతో ఒక పక్కకు ఒరిగింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
న్యూఢిల్లీ, నవంబర్ 7: వీసాలు, వ్యవస్థీకృత నేరాలువంటి అంశాలపై ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు ప్రారంభించాలని భారత్, బ్రిటన్ సోమవారం నిర్ణయించాయి. ఉగ్రవాదంపైనా ఆందోళన వ్యక్తం చేసిన ఇరు దేశాలు, ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశ భద్రతకు సంబంధించిన సవాలే కాదని, అనేక దేశాలు, ప్రాంతాలకు ఇది విస్తరించి ఉందని పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 7: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని పార్టీ అధ్యక్షునిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. రాహుల్కు పార్టీ అధ్యక్ష పదవి అప్పగించాలంటూ సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే తుది నిర్ణయాన్ని సోనియాగాంధీకి వదిలిపెట్టింది. అనారోగ్యం కారణంగా విశ్రాంతిలోవున్న సోనియా గాంధీ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 7: శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం విషయంలో కేరళ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. పట్టనంతిట్ట జిల్లాలో గల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
చిత్రం.. యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)కి వ్యతిరేకంగా సోమవారం మధురలో ముస్లిం ఐక్య జమాత్ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి తరలివచ్చిన మహిళలు
చిత్రం.. భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ ప్రధాన మంత్రి థెరిసా మె సోమవారం ఢిల్లీలోని
గాంధీ మహాత్ముని స్మృతిచిహ్నం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం
బెంగళూరు, నవంబర్ 7: ఓ కన్నడ సినిమా షూటింగ్లో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగళూరులో షూటింగ్ జరుగుతుండగా ఇద్దరు నటులు రిజర్వాయర్లో మునిగిపోయారు. హెలికాప్టర్లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హీరో విజయ్తోపాటు ఉదయ, అనిల్ తిప్పగొండనహళ్లి నదిలో దూకారు. విజయ్ సురక్షితంగా బయపడగా మిగతా ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. మధ్యాహ్నం 2.48 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ, నవంబర్ 7: భారత్ వంటి పేద దేశంలో అవినీతికి స్థానం ఉండకూడదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రభుత్వం విధానపరమైన స్పష్టతతో ముందుకు వెళ్లాలని, వ్యక్తుల ఇష్టాయష్టాలు ఇందుకు ప్రాతిపదిక కాకూడదని తెలిపారు. సోమవారం నాడిక్కడ జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారోత్సవాల ముగింపు సభలో మాట్లాడిన ప్రధాని ఆధార్సహా టెక్నాలజీతో అనుసంధానమైన విధానాలద్వారా అవినీతిని అంతం చేయాలన్నారు.